కురుబ, కురుమలను ఎస్టీ జాబితాలోకి చేర్చండి
ABN , First Publish Date - 2023-03-23T22:46:53+05:30 IST
కురుబ, కురుమలను ఎస్టీ జాబితాలోకి చేర్చా లని ఏపీ రాష్ట్రకురుబ, కురుమ సం ఘం అధ్యక్షుడు జబ్బలశ్రీనివాసులు డిమాండ్ చేశారు.
4న డిల్లీలో రౌండ్టేబుల్ సమావేశం
రాష్ట్ర కురుబసంఘం అధ ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు
మదనపల్లె అర్బన, మార్చి23: కురుబ, కురుమలను ఎస్టీ జాబితాలోకి చేర్చా లని ఏపీ రాష్ట్రకురుబ, కురుమ సం ఘం అధ్యక్షుడు జబ్బలశ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం తన కార్యాలయంలో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఏఫ్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీలోని ఆంధ్రాభవన లో కురుబ, కురుమలకు బీసీ వద్దు, ఎస్టీ నే ముద్దు రౌండ్టేబుల్ సమావేశం నిర్వ హిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి కురుబ కురుమ, యుంత, మేధావులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని ఆయన కోరారు. క కార్యక్రమంలో కురబసంఘం నాయకులు కప్పల రాజన్న, గుడిరామాంజులు, రాజ్కుమార్, తంబళ్లపల్లె శ్రీనివాసులు పాల్గొన్నారు.