ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌కు సతీవియోగం

ABN , First Publish Date - 2023-02-06T01:03:33+05:30 IST

సీఎం జగన్‌ ప్రోగ్రామింగ్‌ కో-ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ సతీమణి స్వర్ణకుమారి(45) ఆదివారం తెల్లవారుజామున విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్ను మూశారు.

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌కు సతీవియోగం
స్వర్ణకుమారి భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం జగన్‌, భారతి

గొల్లపూడి, ఫిబ్రవరి 5: సీఎం జగన్‌ ప్రోగ్రామింగ్‌ కో-ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ సతీమణి స్వర్ణకుమారి(45) ఆదివారం తెల్లవారుజామున విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్ను మూశారు. ఆమె భౌతికకాయాన్ని గొల్లపూడిలోని రఘురామ్‌ స్వ గృహంలో ఉంచారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి గొల్లపూడి వచ్చి స్వర్ణకుమారి భౌతికకాయానికి నివాళులర్పించారు. రఘురామ్‌ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.

Updated Date - 2023-02-06T01:03:37+05:30 IST