పిన్నమనేని కోటేశ్వరరావు సతీమణి మృతి

ABN , First Publish Date - 2023-04-27T00:45:03+05:30 IST

జిల్లాపరిషత్‌ మాజీ అధ్యక్షుడు, పిన్నమనేని కోటేశ్వరరావు సతీమణి పిన్నమనేని సరోజినీదేవి(87) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రుద్రపాకలో తుదిశ్వాస విడిచారు.

పిన్నమనేని కోటేశ్వరరావు సతీమణి మృతి

నందివాడ (రుద్రపాక)/గుడివాడ, ఏప్రిల్‌ 26 : జిల్లాపరిషత్‌ మాజీ అధ్యక్షుడు, పిన్నమనేని కోటేశ్వరరావు సతీమణి పిన్నమనేని సరోజినీదేవి(87) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రుద్రపాకలో తుదిశ్వాస విడిచారు. ఆమెకు కొడుకులు పిన్నమనేని వీరయ్య చౌదరి, పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని సురేష్‌, పిన్నమనేని మల్లిఖార్జునరావు, కుమార్తె అంజమ్మ (పున్నమ్మ) ఉన్నారు. వీరిలో పిన్నమనేని వెంకటేశ్వరరావు మాజీ మంత్రి, కృష్ణాజిల్లా అప్కాబ్‌ మాజీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీలో పదవులు పొందారు. 2024లో కైకలూరు నియోజకవర్గం నుంచి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. సరోజినీదేవి అంతిమయాత్రలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, గద్దె రామ్మోహన్‌, గద్దె అనూరాధ, గోపిచంద్‌, గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్‌ రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని భూపతిరాయుడు, పిన్నమనేని పూర్ణ వీరయ్య చౌదరి (బాబ్జీ), గుడివాడ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ వీరయ్య చౌదరి, ప్రముఖ నాయకులు, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు. పిన్నమనేని సరోజనీదేవి మృతి మహిళాలోకానికి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. ఎందరికో రాజకీయ గురువు అయిన పిన్నమనేని కోటేశ్వరరావు సతీమణి సరోజనీదేవి మృతి బాధాకరమని టీడీపీ నేత వెనిగండ్ల రాము ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.

Updated Date - 2023-04-27T00:45:03+05:30 IST