దివిసీమ పునర్నిర్మాణంలో మండలి వెంకటకృష్ణారావు సేవలు నిరుపమానం
ABN , First Publish Date - 2023-09-28T00:42:41+05:30 IST
పెను ఉప్పెనతో అతలాకుతలమైన దివి ప్రాంతాన్ని పునర్నిర్మించటంలో మాజీ మంత్రి దివంగత నేత మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలు నిరుపమానమని తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ అన్నారు.
అవనిగడ్డ, సెప్టెంబరు 27: పెను ఉప్పెనతో అతలాకుతలమైన దివి ప్రాంతాన్ని పునర్నిర్మించటంలో మాజీ మంత్రి దివంగత నేత మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలు నిరుపమానమని తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ అన్నారు. మండలి వెంకట కృష్ణారావు(ఎంవీకే) వర్ధంతిని అవనిగడ్డలో బుధవారం నిర్వహించారు. వంతెన సెంటర్లోని ఎంవీకే విగ్రహానికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్తో కలిసి ప్రసాద్ నివాళుల ర్పించారు. మండలి బుద్ధప్రసాద్ సోదరుడు చిన్నబాబు, మండలి వెంక ట్రామ్, మత్తి శ్రీనివాసరావు, కూనపరెడ్డి చంద్రశేఖర్, యాసం చిట్టిబాబు, నడకుదుటి జనార్దనరావు, మెడబలిమి మల్లికార్జునరావు, బచ్చు రఘు నాథ్, కొల్లూరి వెంకటేశ్వరరావు, రావి రత్నగిరి పాల్గొన్నారు.