రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

ABN , First Publish Date - 2023-01-19T22:36:54+05:30 IST

వైసీపీ పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్ధత ఒక్క చంద్రబాబు నాయుడికే ఉందని టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. కావలి మద్దూరుపాడులో గురువా

రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
మద్దూరుపాడు ప్రజలతో మాట్లాడుతున్న మాలేపాటి తదితరులు

కావలి, జనవరి19: వైసీపీ పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్ధత ఒక్క చంద్రబాబు నాయుడికే ఉందని టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. కావలి మద్దూరుపాడులో గురువారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. బాదుడే బాదుడు కరపత్రాలు అందచేస్తూ వైసీపీ పాలనలో ప్రజలకు జరిగే అన్యాయాలను వివరించారు. ఆయన వెంట పార్టీ నాయకులు పోతుగంటి అలేఖ్య, మన్నవ రవిచంద్ర, కొండా వెంకట్రావు, కొమరా వెంకటేశ్వర్లు, పిలిమిట్ల సుబ్రహ్మణ్యం, పోతుగంటి శ్రీకాంత్‌, గుడిపల్లి వేణు తదితరులు ఉన్నారు.

జంపాని కుటుంబానికి మాలేపాటి పరామర్శ

కావలి రూరల్‌, జనవరి19: కావలి మండలం తాళ్లపాలెం పంచాయతీ రామచంద్రాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త జంపాని శేషయ్య కుటుంబాన్ని గురువారం నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన శేషయ్య కర్మక్రతువులో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన కుమారుడు యానాది, కుటుంబసభ్యులను పరామర్శించారు. మాలేపాటి వెంట నాయకులు కోసూరి వెంకటేశ్వర్లు, మక్కి శ్రీహరి, కోసూరి సుబ్బారావు, జంపాని వెంకటేశ్వర్లు, రమణయ్య, శీనయ్య, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

----------

Updated Date - 2023-01-19T22:36:56+05:30 IST