ఒంగోలు అబ్బాయి.. అమెరికా అమ్మాయి..!
ABN , First Publish Date - 2023-02-25T01:37:54+05:30 IST
తెలుగు అబ్బాయి, అమెరికా అమ్మాయి పెద్దల సమక్షంలో పెళ్లి పీటలెక్కారు.
పెళ్లి పీటలెక్కిన ప్రేమ జంట
ఒంగోలు (కార్పొరేషన్), పిబ్రవరి 24 : తెలుగు అబ్బాయి, అమెరికా అమ్మాయి పెద్దల సమక్షంలో పెళ్లి పీటలెక్కారు. ఒంగోలులోని ప్రముఖ హోటల్ అధినేత ఏదుబాటి కొండయ్యనాయుడు, గుణవతి దంపతుల ఏకైక కుమారుడు సాయికిరణ్ అమెరికాలో ఎంఎస్ చదువుతున్నారు. అదే యూనివర్సిటీలో చదువుతున్న ఆ దేశానికి చెందిన బి.కర్ట్, అన్నె దంపతుల కనిష్ఠ కుమార్తె కైలిన్ (కల్యాణి)తో ఆయన గత కొంతకాలంగా ప్రేమలోఉన్నారు. వీరి ప్రేమను అంగీకరించిన ఇరువురు పెద్దలు వివాహానికి ఒప్పుకున్నారు. ఆ మేరకు శుక్రవారం ఒంగోలులోని ఓ కన్వెన్షన్ హాలులో తెలుగు సంప్రదాయ పద్ధతిలో వైభవంగా పెళ్లి జరిపించారు.