Kanigiri: భర్త ఫోన్‌కు ఊహించని వీడియోలు.. ఈ విషయం తెలిసి అర్ధరాత్రి 1 గంట సమయంలో భార్య ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-09-02T22:10:24+05:30 IST

మూడేళ్లుగా యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడు డబ్బు కోసం న్యూడ్‌ ఫొటోలు, వీడియోలతో బెదిరించడంతో పిల్లలతో సహా ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిల్లల ఏడుపులు గమనించి కుటుంబ సభ్యులు వారిని రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Kanigiri: భర్త ఫోన్‌కు ఊహించని వీడియోలు.. ఈ విషయం తెలిసి అర్ధరాత్రి 1 గంట సమయంలో భార్య ఏం చేసిందంటే..

కనిగిరి: మూడేళ్లుగా యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడు డబ్బు కోసం న్యూడ్‌ ఫొటోలు, వీడియోలతో బెదిరించడంతో పిల్లలతో సహా ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిల్లల ఏడుపులు గమనించి కుటుంబ సభ్యులు వారిని రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్‌ సమీపంలో ఓ ముస్లిం యువతి కూరగాయల దుకాణం నడుపుకుంటోంది. కనిగిరి మండలంలోని తుమ్మకుంట గ్రామానికి చెందిన ఈర్ల శ్రీను అనే వ్యక్తి కూరగాయలు కొనుగోలు చేసేందుకు రోజూ వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది.


ఇలా మూడేళ్ళుగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్న శ్రీను గత కొన్ని రోజులుగా డబ్బులు కావాలని లేకుంటే ఇద్దరి మధ్య ఏకాంతంగా గడిపిన వీడియోలు, ఫొటోలు నీ భర్తతో పాటు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి భర్తకు తెలియకుండా ఇప్పటి వరకు రూ.9లక్షలు ఇచ్చింది. తిరిగి గురువారం మరో లక్ష రూపాయలు కావాలని శ్రీను యువతిపై ఒత్తిడి తెచ్చాడు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆమెకు లక్ష రూపాయలు సర్దుబాటు కాలేదు. డబ్బు విషయమై పలుమార్లు ఫోన్‌లు చేసిన శ్రీను గురువారం తనతో గడిపిన ఫొటోలను, వీడియోలను యువతి భర్త ఫోన్‌కు పంపాడు. దీంతో అవమానంగా భావించి గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో పిల్లలు ఏడ్వటంతో భర్త, కుటుంబ సభ్యులు చూసి రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-09-02T22:11:05+05:30 IST