పోలీస్ బందోబస్తుతో గ్రానైట్ తవ్వకాలా?
ABN , Publish Date - Dec 15 , 2023 | 11:44 PM
ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా గ్రానైట్ తవ్వకాలకు ఇంజాత్రి కొండపై అనుమతు లిచ్చారని, పోలీసుల బందోబస్తుతో ఎన్నాళ్లు తవ్వకాలు చేపడతారని మాజీ ఎమ్మెల్యే కల మట వెంకట రమణ మూర్తి ప్రశ్నించారు. శుక్రవారం జలగలింగుపురం వద్ద జరుగుతున్న గ్రానైట్ పనులను జనసేన నేతలతో కలిసి పరిశీలించారు.
మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి
మెళియాపుట్టి: ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా గ్రానైట్ తవ్వకాలకు ఇంజాత్రి కొండపై అనుమతు లిచ్చారని, పోలీసుల బందోబస్తుతో ఎన్నాళ్లు తవ్వకాలు చేపడతారని మాజీ ఎమ్మెల్యే కల మట వెంకట రమణ మూర్తి ప్రశ్నించారు. శుక్రవారం జలగలింగుపురం వద్ద జరుగుతున్న గ్రానైట్ పనులను జనసేన నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానికులు ఈ కొండను దైవంగా కొలుస్తున్నా గ్రానైట్ తవ్వకాలకు అనుమతులివ్వడం అన్యాయమన్నారు. కొండ చుట్టపక్కల గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గిరిజనుల ఆందోళనకు టీడీపీ మద్దతు ఉంటుంద న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీజ్లు రద్దుచేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో మర్రిపాడు-సి సర్పంచ్ రవ్వల అనూరాధ గణపతి, జనసేన నాయకుడు దుక్క బాలరాజు, టీడీపీ నాయకులు ఎల్.భాస్కరరావు, యు.వంసత్, పరమేష్రెడ్డి, లక్ష్మీ నారాయణ, కె.శంకర్, శ్రీధర్, కె.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.