లోకేష్ పాదయాత్రకు ప్రణాళిక తయారు చేయండి
ABN , First Publish Date - 2023-01-24T23:43:12+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయా త్రకు ప్రణాళికను తయారు చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్లమెంటరీ, అనుబంధ, సాధికారత కమిటీల అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు.
అరసవల్లి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయా త్రకు ప్రణాళికను తయారు చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్లమెంటరీ, అనుబంధ, సాధికారత కమిటీల అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా రవికుమార్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెల నుంచి వచ్చే ఏడు నెలలకు కార్యక్రమ ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. దీన్ని ఫిబ్రవరి 15వ తేదీలోగా జిల్లా కార్యాలయానికి పంపించాలని తెలిపారు. రెండవ దఫా ఓటరు జాబితా పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని, జిల్లాలో ఉన్న సమస్యలపై అనుబంధ కమిటీలు, సాధికా రత కమిటీలు స్పందించి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వీటన్నింటినీ పరిశీలించ డానికి ఒక ప్రతినిధిని నియమిస్తామన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో రైతులకు మద్ద తుగా ధాన్యం బస్తాలు, ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని తీర్మా నించారు. కార్యక్రమంలో నాయకులు పీరుకట్ల విఠల్, పీఎంజే బాబు, చిట్టి మోహన్, బుక్కా యుగంధర్, దుమ్ము అశోక్, గోవింద పాపారావు తదితరులు పాల్గొన్నారు.