అప్రమత్తతతోనే అక్రమ రవాణా నియంత్రణ

ABN , First Publish Date - 2023-03-31T23:48:40+05:30 IST

అప్రమత్తతతోనే బాలబాలికల అక్రమ రవాణాను నియంత్రించవ చ్చునని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు అన్నారు.

అప్రమత్తతతోనే అక్రమ రవాణా నియంత్రణ

ఎచ్చెర్ల: అప్రమత్తతతోనే బాలబాలికల అక్రమ రవాణాను నియంత్రించవ చ్చునని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు అన్నారు. ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ ఆవరణలో శుక్రవారం మానవ అక్రమ రవాణా నియంత్రణ విభాగం (ఏహెచ్‌టీయూ), ఛైల్డ్‌ లైన్‌ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ ఎల్‌.వెం కటరావు, ఛైల్‌ లైన్‌ ప్రతినిధి మెహర్వానీ మాట్లాడుతూ బాలల హక్కులు, బాల్య వివాహాల అనర్ధాలను, మానవ అక్రమ రవాణా వల్ల సమాజంపై పడే దుష్ప్రభా వాన్ని వివరించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ ఎల్‌డీ సుధాకర్‌బాబు, ఏవో ముని రామకృష్ణ, అకడమిక్‌ డీన్‌ మోహన్‌కృష్ణ చౌదరి, పీఆర్వో మామిడి షణ్నుఖ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T23:48:40+05:30 IST