Chandrababu arrest: మద్ధతు ప్రకటించిన తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి, పిల్లలు

ABN , First Publish Date - 2023-09-24T10:30:09+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరసనలు మిన్నంటుతున్నాయి.

Chandrababu arrest: మద్ధతు ప్రకటించిన తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి, పిల్లలు

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ ఆందోళనలు ఒక్క తెలుగు రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న ప్రతిచోటా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ నిరసనలు మరింత తీవ్రంగా ఉన్నాయి.


చంద్రబాబుకు మద్దతు పలుకుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చంద్రబాబు అరెస్టును దివంగత తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి, పిల్లలు ఇప్పటికే ఖండించగా.. తాజాగా ఐటీ ఉద్యోగులు ప్రకటించిన సంఘీభావ ర్యాలీకి కూడా మద్దతు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకి నిరసనగా ఐటీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన ‘హైదరాబాద్ నుంచి రాజమండ్రి’ సంఘీభావ ర్యాలీకి మద్ధతు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా టీడీపీ తెలిపింది.

Updated Date - 2023-09-24T10:31:03+05:30 IST