బాబోయ్ ఎండలు
ABN , First Publish Date - 2023-04-20T00:19:18+05:30 IST
భానుడి భగభగలతో జిల్లాప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రాలేకపో తున్నారు. నిప్పులకొలిమిలా ఎండలు మండుతున్నాయి. గడిచిన నాలుగు రోజుల నుంచి 40, 41 డిగ్రీల వద్దే ఉష్ణోగ్రతలు నమోదుకావటంతో చిరు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.
విజయనగరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
భానుడి భగభగలతో జిల్లాప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రాలేకపో తున్నారు. నిప్పులకొలిమిలా ఎండలు మండుతున్నాయి. గడిచిన నాలుగు రోజుల నుంచి 40, 41 డిగ్రీల వద్దే ఉష్ణోగ్రతలు నమోదుకావటంతో చిరు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. విజయనగరంలోని కోట ఎదురుగా ఉన్న స్థలంలో ఎండవేడికి తాళలేక ఉదయం 10 గంటలకే వ్యాపారులు దుకాణం బంద్ చేసి వెళ్లిపోయారు. మరోవైపు వడగాడ్పుల కారణంగా ఎవరూ ప్రయాణాలు చేయడం లేదు. రహదారులన్నీ వెలవెలబోతున్నాయి. ఆటోలు కూడా నడవడం లేదు. విజయనగరంలో బుధవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడంతో రోడ్లు, జంక్షన్లు, మార్కెట్లు బోసిపోయాయి.
- విజయనగరం(ఆంధ్రజ్యోతి)