Vundavalli Arun Kumar : ఉండవల్లి పిల్‌ను వేరే బెంచ్‌కు వేయాలన్న సీజే బెంచ్

ABN , First Publish Date - 2023-09-27T12:01:42+05:30 IST

స్కిల్ కేసులో సీబీఐ విచారణ జరపాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్‌ను వేరే బెంచ్‌కు వేయాలని సీజే బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తమలో ఒకరికి ఈ పిల్‌ను విచారించేందుకు అభ్యంతరం ఉందని బెంచ్ పేర్కొంది. ఈ క్రమంలోనే వేరే బెంబ్‌కు వేయాలని సూచించింది.

Vundavalli Arun Kumar : ఉండవల్లి పిల్‌ను వేరే బెంచ్‌కు వేయాలన్న సీజే బెంచ్

అమరావతి : స్కిల్ కేసులో సీబీఐ విచారణ జరపాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్‌ను వేరే బెంచ్‌కు వేయాలని సీజే బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తమలో ఒకరికి ఈ పిల్‌ను విచారించేందుకు అభ్యంతరం ఉందని బెంచ్ పేర్కొంది. ఈ క్రమంలోనే వేరే బెంబ్‌కు వేయాలని సూచించింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐ (CBI) విచారణకు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రెండుమూడు రాష్ట్రాలకు విస్తరించి ఉండటంతో కేసును సీబీఐకి ఇవ్వాలని పిటిషన్‌లో ఉండవల్లి కోరారు. ఆర్థిక పరమైన నేరం, జీఎస్టీ ఎగవేత ఉండటం, ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేస్తుందని, అందువలనే సీబీఐ విచారణకు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసినట్లు ఉండవల్లి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-27T12:01:42+05:30 IST