రసాయన డబ్బా పేలి ఒకరి మృతి
ABN , First Publish Date - 2023-11-29T00:20:18+05:30 IST
రసాయన ప్లాస్టిక్ డబ్బా పేలి ఓ వ్యక్తి మృతి చెందారు.
కలిదిండి, నవంబరు 28: రసాయన ప్లాస్టిక్ డబ్బా పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. కోరుకొల్లులో చెన్నంశెట్టి బాపూజీ నడుపుతున్న పాత ఇనుప సామాన్ల దుకాణం నుంచి బిహార్కు చెందిన రాకేష్ సింగ్ (21) మరో ఇద్దరు స్నేహితులు పాత ఇనుప సామాన్లను వ్యాన్లోకి లోడు చేస్తుండగా, వాటిలో ఉన్న రసాయన డబ్బా పేలటంతో రాకేష్ సింగ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి స్నేహితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రియకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.