పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2023-04-08T00:01:26+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం వాహ నాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకు న్నారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత
బియ్యం లారీని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్‌ అధికారులు

పెనుగొండ, ఏప్రిల్‌ 7: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం వాహ నాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకు న్నారు. ఏలూరు జిల్లా రీజనల్‌ విజి లెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి కరణం కుమార్‌కు అందిన సమాచా రం మేరకు గురువారం అర్ధరాత్రి రెండు గంటలకు పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు వైజంక్షన్‌ వద్ద అధికా రులు దాడులు చేసి వాహనాన్ని సీజ్‌చేశారు. వీరవాసరం నుంచి తూర్పు గోదావరి జిల్లా ఆలమూరుకు బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. వీరవాసరం మండలం తోకలపూడి కి చెందిన కత్తుల సత్తిబాబు, వాహన యజమాని కమ్‌ డైవ్రర్‌ ఆలమూరుకు చెందిన గంగుల వీరగణేష్‌లను అదుపులోకి తీసుకున్నామ న్నారు. వీరి నుంచి 72 వేల రూపాయల విలువైన 40 టన్నుల బియ్యంతోపాటు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విజిలెన్స్‌ సీఐ పులపర్తి శివ రామకృష్ణ, పెనుమంట్ర సివిల్‌ సప్లై ఆర్‌ఐ పోతురాజు, వీఆర్వో ఉన్నారు.

Updated Date - 2023-04-08T00:01:26+05:30 IST