Share News

YCP: వైసీపీ సభకు ఆటోల్లో జనాల తరలింపు.. సభ మొదలు కాకుండానే వెళ్లిపోయిన ప్రజలు

ABN , First Publish Date - 2023-11-29T18:14:58+05:30 IST

మచిలీపట్నంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైసీపీ సభ కోసం ఆటోల్లో మహిళలను తరలిస్తున్నారు. సభ మొదలు కాకుండానే ప్రజలు వెనుదిరిగారు. అటుగా వచ్చిన కారును పసుపు రంగు కండువా ఉందనే కారణంతో పోలీసులు అడ్డుకున్నారు.

YCP: వైసీపీ సభకు ఆటోల్లో జనాల తరలింపు.. సభ మొదలు కాకుండానే వెళ్లిపోయిన ప్రజలు

కృష్ణా: మచిలీపట్నంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైసీపీ సభ కోసం ఆటోల్లో మహిళలను తరలిస్తున్నారు. సభ మొదలు కాకుండానే ప్రజలు వెనుదిరిగారు. అటుగా వచ్చిన కారును పసుపు రంగు కండువా ఉందనే కారణంతో పోలీసులు అడ్డుకున్నారు.

కారు స్వాధీనం చేసుకొని స్టేషన్ కు తరలించారు. సభ నుంచి వెళ్లిపోతున్న వారి ఫొటోలు తీస్తున్న మీడియా ప్రతినిధులు ఫోన్లను వైసీపీ కార్యకర్తలు లాక్కున్నారు. పోలీసులు స్పందించి న్యాయం చేయాలని జర్నస్టులు కోరుతున్నారు.

Updated Date - 2023-11-29T18:15:00+05:30 IST