YCP MLA Dwarampudi : నా దగ్గర రూ.15 వేల కోట్లుంటే పవన్‌ను కొనేస్తా.. రాబోయే రోజుల్లో నేనేంటో చూపిస్తా..

ABN , First Publish Date - 2023-06-19T11:49:15+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న పవన్ తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ తన నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టలేక కాకినాడ రూరల్‌లో సభ పెట్టాడని విమర్శించారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు. జనసేన పార్టీని పవన్ ఎవరిని ఉద్దరించేందుకు పెట్టాడని ప్రశ్నించారు. పవన్ వెనుక పార్టీలో ఎవ్వరూ లేరని ఎద్దేవా చేశారు.

YCP MLA Dwarampudi : నా దగ్గర రూ.15 వేల కోట్లుంటే పవన్‌ను కొనేస్తా.. రాబోయే రోజుల్లో నేనేంటో చూపిస్తా..

కాకినాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న పవన్ తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ తన నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టలేక కాకినాడ రూరల్‌లో సభ పెట్టాడని విమర్శించారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు. జనసేన పార్టీని పవన్ ఎవరిని ఉద్దరించేందుకు పెట్టాడని ప్రశ్నించారు. పవన్ వెనుక పార్టీలో ఎవ్వరూ లేరని ఎద్దేవా చేశారు. తను ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధిస్తే.. పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడని ద్వారంపూడి అన్నారు. తనను విమర్శించే స్థాయి పవన్‌కు లేదన్నారు.

ప్యాకేజీ కుదరక రోడ్లు పట్టుకుని తిరుగుతున్నావ్..

పవన్ పొలిటికల్‌గా జీరో అన్నారు. ప్యాకేజీ చాల్లేదని వారాహి ఎక్కి తిరుగుతున్నావంటూ ద్వారంపూడి మండిపడ్డారు. సీఎంగా తాను చాలనని.. తన స్థాయి సరిపోదని మూడు నెలల క్రితం చంద్రబాబుకు మద్దతు పలికాడన్నారు. ఇంతలోనే కత్తిపూడి సభలో మాట మార్చాడని.. సీట్లు కుదరక తనను సీఎం చేయాలని అడుగుతున్నాడని పేర్కొన్నారు. కుమారస్వామిలా కాచుకు కూ ర్చున్నావంటూ ఎద్దేవా చేశారు. ప్యాకేజీ కుదరక రోడ్లు పట్టుకుని తిరుగుతున్నావని మండిపడ్డారు. రాజకీయాల్లో కూడా హీరోగా నిరూపించుకోవాలని సవాల్ చేశారు. మార్చి 14న ఒక మాట.. జూన్ 18న ఒక మాట మాట్లాడతావా? అంటూ పవన్‌పై ద్వారంపూడి మండిపడ్డారు. ఎవడో చెప్పిన మాటలు విని కోతిలా గంతులు వేయవద్దని ద్వారంపూడి హితవు పలికారు.

నేను డీ బ్యాచ్.. నువ్వు ఏ బ్యాచ్..

బియ్యం వ్యాపారం తో రూ.15వేల కోట్లు తాను సంపాదించడం అబద్ధమని ద్వారంపూడి అన్నారు. తన వద్ద అంత డబ్బు ఉంటే పవన్‌ను కొనేస్తానన్నారు. పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతులు పెరగడం ప్రభుత్వం చొరవేనన్నారు. తాను తల్చుకుంటే మీ బ్యానర్లను కట్టనివ్వనని హెచ్చరించారు. తనది డీ బ్యాచ్ అయితే పవన్ ది ఏ బ్యాచ్ అని అన్నారు. పవన్ కంటే తమకు తెగింపు ఎక్కువన్నారు. పవన్ మాదిరిగా మాటలు చెప్పనని.. చేతల్లో చూపిస్తానన్నారు. జన్మలో పవన్ తనను బేడీలు వేసి కొట్టలేడన్నారు. రాబోయే రోజుల్లో తానేంటో చూపిస్తానన్నారు. పవన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానన్నారు. దమ్ముంటే పవన్ కాకినాడ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. తనను ఓడించడం పవన్ వల్ల కాదని.. తానే ఆయన్ను ఓడిస్తానన్నారు.

నువ్వో డెకాయిట్‌.. కాకినాడను డ్రగ్స్‌ డెన్‌గా మార్చావ్..

ఇక నిన్న కాకినాడ బహిరంగా సభలో పవన్.. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ‘ద్వారంపూడి నువ్వో డెకాయిట్‌.. కాకినాడను నువ్వు డ్రగ్స్‌ డెన్‌గా మార్చావు.. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా.. నీ నేర సామ్రాజ్యం నేలకూలుస్తా. నీకు రోజులు దగ్గర పడ్డాయి జాగ్రత్త.. నిన్ను, సీఎం జగన్‌ని రోడ్డుకీడ్చుతా..ఈ నాలుగేళ్లలో నీ కుటుంబం అక్రమ సంపాదన రూ.15వేల కోట్లు.. ఎక్కడైనా స్థలం కనిపిస్తే చాలు కబ్జాలకు పాల్పడడం, అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడడం, గంజాయి సరఫరా, బియ్యం వ్యాపారంతో సంపాదించిన అక్రమార్జనతో బలిసి ఉన్నాడు. అతడి అక్రమాల చిట్టా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఉంది. జనసేన అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే తాతను బేడీలు వేసి జైలుకి పంపించిన అప్పటి ఎస్పీ డీటీ నాయక్‌లా తాను బీమ్లా నాయక్‌ ట్రీట్మెంట్‌ చూపిస్తాను.. ఎమ్మెల్యేను జైలుకు పంపి క్రిమినల్స్‌ని ఏరిపారేస్తా.. ఏమూలకెళ్లినా అతడి అక్రమ బాగోతాలే బయటపడుతున్నాయి’ అని ద్వారంపూడిపై పవన్ నిప్పులు చెరిగారు.

Updated Date - 2023-06-19T12:00:40+05:30 IST