China Imposes: బిలియనీర్ జాక్‌మా ‘యాంట్ గ్రూప్‌’కు భారీ జరిమానా..

ABN , First Publish Date - 2023-07-09T14:59:30+05:30 IST

చైనీస్ బిలియనీర్ జాక్ మా ఫైనాన్షియల్ కంపెనీలకు ఎట్టకేలకు చైనా ప్రభుత్వం జరిమానా విధించింది. జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్‌ పై బిలియన్ డాలర్ల జరిమానా విధించింది.

China Imposes: బిలియనీర్ జాక్‌మా ‘యాంట్ గ్రూప్‌’కు భారీ జరిమానా..

చైనీస్ బిలియనీర్ జాక్ మా(Chinese Billionaire Jack Ma) ఫైనాన్షియల్ కంపెనీలకు చైనా ప్రభుత్వం జరిమానా విధించింది(China Imposes). జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్‌(Ant Group)పై బిలియన్ డాలర్ల జరిమానా(Fine) విధించింది. 2020లో యాంట్ గ్రూప్‌పై ఆంక్షలు విధించిన చైనా ప్రభుత్వం.. మూడేళ్ల తర్వాత జరిమానా విధించింది. మరోవైపు యాంట్ గ్రూప్‌కు చెందిన క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ జియాంగ్‌హుబావోను మూసివేయాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది.


2020లో యాంట్ గ్రూప్‌ ఐపీవోలను చైనా నిలిపివేసింది. యాంట్‌ గ్రూప్‌పై ఆంక్షల తర్వాత దాని సోదర సంస్థ అలీబాబాపై చైనా అధికారులు రికార్డు స్థాయిలో 2.8 బిలియన్ల డాలర్లు యాంటీట్రస్ట్ పెనాల్టీని విధించింది. రైడ్ హెయిలింగ్ కంపెనీ దీదీపై కూడా 1.2 బిలియన్ల డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. యాంట్, దాని అనుబంధ సంస్థలకు చైనా అధికారులు మొత్తం 985 మిలియన్ల డాలర్ల జరిమానా విధించారు. వైద్య ఖర్చుల కోసం ఏర్పాటు చేసిన క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ జియాంగ్‌హుబావోను మూసివేయాలని కంపెనీని చైనా అధికారులు ఆదేశించారు.


కాగా..ప్రపంచలోనే అతిపెద్ద ఆన్‌టైన్ ఫైనాన్షియల్ టెక్ కంపెనీల్లో ఒకటైన యాంట్‌ను జాక్ మా 2014లో స్థాపించారు. 2020 నవంబర్‌లో కంపెనీ అంచనా వేసిన 34 బిలియన్ డాలర్ల ఐపీవోను చేరుకునే సరిగ్గా ఒకరోజు ముందు యాంట్ గ్రూప్‌కు చెందిన భారీ ఐపీవోను చైనా అధికారులు నిలిపివేశారు. అయితే ఐపీవో నిలిపివేతపై జాక్ మా చైనా ప్రభుత్వం బహిరంగంగానే విమర్శలు చేశారు. అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు.


చైనా ప్రభుత్వం విధించిన జరిమానాపై యాంట్ గ్రూప్ స్పందించింది. 2020లో తర్వాత తమ వ్యాపారాన్ని చిత్తశుద్ధితో, రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు యాంట్ గ్రూప్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2023-07-09T14:59:30+05:30 IST