Share News

ఒబెరాయ్ గ్రూపు గౌరవ చైర్మన్ పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూత

ABN , First Publish Date - 2023-11-14T11:05:25+05:30 IST

దేశీయ ఆతిథ్యరంగ దిగ్గజం ఒబెరాయ్ గ్రూపు గౌరవ చైర్మన్ పృథ్విరాజ్ సింగ్ ఒబెరాయ్ (PRS Oberoi) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ‘బికీ’గా (Bike) ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన 94 ఏళ్ల వయసులో ప్రశాంతంగా కన్నుమూశారని ఒబెరాయ్ గ్రూపు ప్రకటించింది.

ఒబెరాయ్ గ్రూపు గౌరవ చైర్మన్ పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూత

న్యూఢిల్లీ: దేశీయ ఆతిథ్యరంగ దిగ్గజం ఒబెరాయ్ గ్రూపు గౌరవ చైర్మన్ పృథ్విరాజ్ సింగ్ ఒబెరాయ్ (PRS Oberoi) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ‘బికీ’గా (Bike) ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన 94 ఏళ్ల వయసులో ప్రశాంతంగా కన్నుమూశారని ఒబెరాయ్ గ్రూపు ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయని ప్రకటనలో కంపెనీ పేర్కొంది.


కాగా భారత్‌లో హోటల్ రంగ ముఖచిత్రం మార్పునకు కారణమైన ఆయన ఫిబ్రవరి 3, 1929న ఢిల్లీలో జన్మించారు. డార్జిలింగ్‌లోని సెయింట్ పాల్ స్కూల్లో విద్యాబ్యాసం చేశారు. అనంతరం స్విట్జర్లాండ్‌లో హోటల్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2002లో తండ్రి చనిపోవడంతో ‘ది ఒబెరాయ్ గ్రూపు’ మొదటి కంపెనీ ఈఐహెచ్ లిమిటెడ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ స్థాయిలో ఒబెరాయ్ హోటల్స్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. భారత్‌లోని ముఖ్యమైన టూరిస్ట్ ప్రాంతాల్లోనే కాకుండా మారిషస్, ఇండోనేసియా, ఈజిప్ట్ దేశాల్లో కూడా కొన్ని హోటల్స్‌ను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-11-14T11:05:26+05:30 IST