దారుణం.. కాళ్లు, చేతులు, నోరు కట్టివేసి కనిపించిన 72 ఏళ్ల వృద్ధుడి మ‌ృతదేహం.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-08-15T21:42:49+05:30 IST

రాజస్థాన్‌లోని కుచమన్ జిల్లాలో(Rajasthan's Kuchaman district) దారుణం చోటుచేసుకుంది. కాళ్లు, చేతులు, నోరు కట్టివేసి ఉన్న 72 ఏళ్ల వృద్దుడి మృతదేహం కలకలంరేపింది.

దారుణం.. కాళ్లు, చేతులు, నోరు కట్టివేసి కనిపించిన 72 ఏళ్ల వృద్ధుడి మ‌ృతదేహం.. అసలు ఏం జరిగిందంటే..?

రాజస్థాన్‌లోని కుచమన్ జిల్లాలో(Rajasthan's Kuchaman district) దారుణం చోటుచేసుకుంది. కాళ్లు, చేతులు, నోరు కట్టివేసి ఉన్న 72 ఏళ్ల వృద్దుడి మృతదేహం కలకలంరేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహన్ దాస్(Mohan Das) అనే 72 ఏళ్ల వృద్ధుడు రసాల గ్రామంలో(Rasal village) గత 15 సంవత్సరాలుగా నివసిస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ దాస్ ఒంటరిగానే నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి మోహన్ దాస్ బాగానే ఉన్నాడు. గ్రామస్థులతో మాట్లాడి తన ఇంటికి వెళ్లి నిద్రించాడు. సోమవారం ఉదయం ఆ వృద్ధుడు ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో గ్రామస్థులు వెళ్లి చూశారు. అయితే మోహన్ దాస్ నేలపై శవపై పడి ఉండడాన్ని గ్రామస్థులు గుర్తించారు. అంతేకాకుండా మోహన్ దాస్ కాళ్లు, చేతులు, నోరు కట్టేసి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.


హత్య కేసుగా నమెదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు తర్వాత అదే గ్రామంలోని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. "మోహన్ దాస్ ఒంటరిగా జీవిస్తున్నాడు. చేతులు, కాళ్ళు, నోరు కట్టివేసిన స్థితిలో అతని మృతదేహం కనుగొనబడింది. ఇది హత్యగా అనుమానం కలిగిస్తుంది. మేము హత్య కేసు నమోదు చేశాం. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నాం" అని కూచమన్ సిటీ ఎస్‌హెచ్‌ఓ సురేష్ కుమార్ తెలిపారు. కాగా మోహన్ దాస్‌ను ఎవరో కావాలనే కాళ్లు, చేతులు, నోరు కట్టేసి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాళ్లు, చేతులు, నోరు కట్టేయడంతో మోహన్ దాస్ ఊపిరి ఆడక చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

Updated Date - 2023-08-15T21:47:37+05:30 IST