Crime: బెయిల్పై బయటకు వచ్చారు.. అత్యాచారం కేసు పెట్టిన 19 ఏళ్ల అమ్మాయినే చంపేసి వెళ్లిపోయారు..!
ABN , First Publish Date - 2023-11-21T21:00:50+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని కౌశంబి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన సోదరుడిపై అత్యాచారం కేసు పెట్టిందనే కోపంతో ఉన్న ఓ వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చి ఓ యువతిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) కౌశంబి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన సోదరుడిపై అత్యాచారం కేసు పెట్టిందనే కోపంతో ఉన్న ఓ వ్యక్తి జైలు (Jail) నుంచి బయటకు వచ్చి ఓ యువతిని గొడ్డలితో (Axe) నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కౌశంబి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన పవన్ కుమార్ అనే యువకుడిపై మూడేళ్ల క్రితం ఓ యువతి అత్యాచారం కేసు పెట్టింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు (Crime News).
కొద్ది రోజుల తర్వాత పవన్ కుమార్ బెయిల్పై బయటకు వచ్చాడు. అతడి సోదరుడు అశోక్ కొద్ది రోజుల క్రితం ఓ హత్య కేసులో జైలుకు వెళ్లాడు. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చాడు. అశోక్, పవన్ కలిసి 19 ఏళ్ల బాధితురాలిని బెదిరించారు. అత్యాచారం కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించారు. అందుకు ఆ యువతి కుటుంబం అంగీకరించలేదు. సోమవారం సాయంత్రం బాధిత యువతి గేదెలను తోలుకుని ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో ఆమెను అశోక్, పవన్ అడ్డగించారు.
NASA: నాసా విడుదల చేసిన షాకింగ్ ఫొటో.. ఫొటో తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు..!
కేసును ఉపసంహరించుకోవాలని మరోసారి బెదరించారు. ఆ యువతి అంగీకరించకపోవడంతో తమతో తెచ్చుకున్న గొడ్డలితో ఆ యువతిని నరికేశారు. ఆ యువతి అక్కడిక్కడే మరణించింది. నిందితులిద్దరూ గ్రామం వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు.