Share News

Terrorist:భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం.. పాకిస్థాన్‌లో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

ABN , First Publish Date - 2023-11-10T11:16:52+05:30 IST

భారత్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ.. నిత్యం వార్తలో ఉండే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్(Terrorist) నిన్న హతమయ్యాడు. అతని సొంతగడ్డపై గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడం సంచలనం సృష్టిస్తోంది. వివరాలు.. లష్కరే తోయిబా(lashkar e taiba) మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్ ను పాక్ లోని బజౌర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం కాల్చి చంపారు.

Terrorist:భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం.. పాకిస్థాన్‌లో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

ఇస్లామాబాద్: భారత్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ.. నిత్యం వార్తలో ఉండే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్(Terrorist) నిన్న హతమయ్యాడు. అతని సొంతగడ్డపై గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడం సంచలనం సృష్టిస్తోంది. వివరాలు.. లష్కరే తోయిబా(lashkar e taiba) మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్(Akram Khan) ను పాక్ లోని బజౌర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం కాల్చి చంపారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. అక్రమ్ ఖాన్ ని అక్రమ్ గాజీ అని కూడా పిలుస్తారు.


2018 నుంచి 2020 వరకు LeT రిక్రూట్‌మెంట్ సెల్‌కు నాయకత్వం వహించిన గాజీ, పాకిస్తాన్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడంలో పేరుగాంచాడు. గతంలో అనేక తీవ్ర వాద కార్యకలాపాల్లోనూ ఇతను పాల్గొన్నాడు. అక్టోబర్‌లో పఠాన్‌కోట్‌ దాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ను పాకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. గుజ్రాన్‌వాలా నగరంలో నివసిస్తున్న లతీఫ్ భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడు. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోకి చొరబడిన నలుగురు ఉగ్రవాదులకు కమాండర్ గా వ్యవహరించాడు. సెప్టెంబరులో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ రావల్‌కోట్‌లోని అల్-ఖుదుస్ మసీదులో లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్టు కమాండర్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. హత్యకు గురైన ఉగ్రవాదిని రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిమ్‌గా గుర్తించారు. ఇలా వరుసబెట్టి సొంతగడ్డపై ఉగ్రవాదులు హతమవుతుండటం పాకిస్థాన్‌లో సంచలనం సృష్టిస్తోంది.

Updated Date - 2023-11-10T11:16:55+05:30 IST