Share News

500 crore deal : 500 కోట్ల డీల్‌!

ABN , First Publish Date - 2023-11-15T03:13:57+05:30 IST

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీ ఆత్మరక్షణలో పడింది. మధ్యప్రదేశ్‌ సీఎం రేసులో ఉన్న కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ కుమారుడు ..

500 crore deal : 500 కోట్ల డీల్‌!

వివాదంలో కేంద్ర మంత్రి తనయుడు దేవేంద్ర తోమర్‌

భోపాల్‌, నవంబరు 14: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీ ఆత్మరక్షణలో పడింది. మధ్యప్రదేశ్‌ సీఎం రేసులో ఉన్న కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ కుమారుడు దేవేంద్రసింగ్‌కు సంబంధించిన వివాదాస్పద వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోలో దేవేంద్ర సింగ్‌ రూ.500 కోట్లకు సంబంధించి డీల్‌ కుదుర్చుకుంటున్నట్టుగా ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇది ‘వ్యాపం’ కుంభకోణం కన్నా పెద్దది. అయినా ఇప్పటికీ దీనిపై విచారణ లేదు. ఈడీ, సీబీఐలు ఇటువైపు కన్నెత్తి చూడవు’’ అని దుయ్యబట్టారు. ఓ వారం కిందట కూడా దేవేంద్రసింగ్‌కు సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో ఒకటి రూ.100 కోట్లు, మరొకటి రూ.18-21 కోట్లకు సంబంధించిన డీల్‌పై ఆయన మాట్లాడుతున్నట్టు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఈ వీడియోల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అయితే, బీజేపీ మాత్రం ఈ వీడియోలను నకిలీవిగా కొట్టిపారేస్తోంది. మరోవైపు దేవేంద్ర సింగ్‌.. ఈ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కేంద్ర మంత్రి తోమర్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

Updated Date - 2023-11-15T03:13:58+05:30 IST