INDIA block: ఇండియా కూటమికి సీపీఎం బిగ్ షాక్?

ABN , First Publish Date - 2023-09-18T15:02:17+05:30 IST

ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమికి అనూహ్య ఎదురుదెబ్బ తగలబోతోందా? అంటే ఔననే సమాధానమిస్తున్నాయి రిపోర్టులు. పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాలలో ఇండియా కూటమికి దూరంగా జరగాలని సీపీఐ-ఎం (CPI-M) నిర్ణయించినట్టు జాతీయ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

INDIA block: ఇండియా కూటమికి సీపీఎం బిగ్ షాక్?

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమికి అనూహ్య ఎదురుదెబ్బ తగలబోతోందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాలలో ఇండియా కూటమికి దూరంగా జరగాలని సీపీఐ-ఎం (CPI-M) నిర్ణయించినట్టు జాతీయ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. బెంగాల్‌లో టీఎంసీ, కేరళలో కాంగ్రెస్ పార్టీలు తమ ప్రధాన ప్రత్యర్థులని, ప్రతిపక్షాల ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో వారాంతం జరిగిన సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది.


మరోవైపు బీజేపీ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా నిర్వహించే సమన్వయ సమావేశాలకు ప్రతినిధులు ఎవర్నినీ పంపించకూడదని సీపీఎం నిర్ణయించినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా సీపీఎం తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది బీజేపీ సారధ్యంలోని కూటమికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్న ఇండియా కూటమిలోని లోపాలకు ఇదొక సంకేతమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంపై కూటమిలోని ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి.

Updated Date - 2023-09-18T15:02:17+05:30 IST