కృష్ణ వావిలాలకు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అవార్డు

ABN , First Publish Date - 2023-01-18T03:11:46+05:30 IST

తెలుగు తేజం, ఇండో అమెరికన్‌, ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా స్టడీస్‌ (ఎఫ్‌ఐఎస్‌) వ్యవస్థాపకుడు కృష్ణ వావిలాల (86)కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో భారతీయులను, నల్లజాతీయులను

కృష్ణ వావిలాలకు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అవార్డు

హూస్టన్‌, జనవరి 17: తెలుగు తేజం, ఇండో అమెరికన్‌, ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా స్టడీస్‌ (ఎఫ్‌ఐఎస్‌) వ్యవస్థాపకుడు కృష్ణ వావిలాల (86)కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో భారతీయులను, నల్లజాతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆయన చేసిన విశేష కృషికి గానూ ప్రతిష్ఠాత్మక మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (ఎంఎల్‌కే) గ్రాండ్‌ పరేడ్‌ అవార్డు ఆయనను వరించింది. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ జయంతి సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎంఎల్‌కే జూనియర్‌ పరేడ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, సీఈవో చార్లెస్‌ స్టాంప్స్‌ ఈ అవార్డుని కృష్ణ వావిలాలకు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి చెందిన కృష్ణ వావిలాల అమెరికాలో ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా పనిచేసి రిటైరయ్యారు. గాంధీజీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఇద్దరూ అనుసరించిన అహింసా సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసేందుకు ఆయన విశేషంగా కృషి చేశారు.

Updated Date - 2023-01-18T03:11:47+05:30 IST