Minister Sriramulu: నేను వెళ్లను.. మీరూ వెళ్లొద్దు..!

ABN , First Publish Date - 2023-01-10T12:19:30+05:30 IST

నేను బీజేపీలో ఉంటా.. మీరు ఇక్కడే ఉండండి..ఎవ్వరూ కేఆర్‌పీపీలోకి వెళ్లకండి అంటూ మంత్రి శ్రీరాములు(Minister Sriramulu) కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Minister Sriramulu: నేను వెళ్లను.. మీరూ వెళ్లొద్దు..!

- కేఆర్‌పీపీలో చేరికపై బీజేపీ కార్యకర్తలతో మంత్రి శ్రీరాములు

- బళ్లారిలో ఆసక్తికర రాజకీయాలు

బళ్లారి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): నేను బీజేపీలో ఉంటా.. మీరు ఇక్కడే ఉండండి..ఎవ్వరూ కేఆర్‌పీపీలోకి వెళ్లకండి అంటూ మంత్రి శ్రీరాములు(Minister Sriramulu) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం బళ్లారి రూరల్‌ పరిదిలోని సంగనకల్లు వద్ద గౌడ అనే వ్యక్తి తోటలో మంత్రి శ్రీరాములు బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ.. గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) స్థాపించిన కేఆర్‌పీపీలోకి కార్యకర్తలు ఎవరూ వెళ్లొద్దండి.. నేను మీకు అండగా ఉంటాను, నేను బీజేపీలోనే ఉంటాను అన్నారు. సుమారు 200 మంది బీజేపీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. గాలి జ నార్దన్‌ రెడ్డి స్థాపించిన కేఆర్‌పీపలోకి పలువురిని ఆకట్టుకు నేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలాంటి సమయంలోనే మంత్రి శ్రీరాములు సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌ ఇలా అన్ని పార్టీల నాయకులనూ కేఆర్‌పీపీలో చేరాలని గాలి మంతనాలు చేస్తున్నారని సమాచారం. అయితే ఇందులో చాలా మంది కేఆర్‌పీపీలో చేరేందుకు సుముఖంగా లేరు. అయితే కార్యకర్తలను కాపాడుకు నేందుకే మంత్రి శ్రీరాములు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో ఆసక్తికర రాజకీయాలకు తెర లేచినట్లు అయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - 2023-01-10T12:22:55+05:30 IST