Trains cancelled: రేపు కొన్ని ఈఎంయూ రైళ్లు రద్దు

ABN , First Publish Date - 2023-01-21T10:22:10+05:30 IST

రైల్వే ట్రాక్‌ మరమ్మతు కారణంగా చెన్నై - గుమ్మిడిపూండి(Chennai - Gummidipundi) మధ్య 22న ఈఎంయూ రైళ్లను

Trains cancelled: రేపు కొన్ని ఈఎంయూ రైళ్లు రద్దు

చెన్నై, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రైల్వే ట్రాక్‌ మరమ్మతు కారణంగా చెన్నై - గుమ్మిడిపూండి(Chennai - Gummidipundi) మధ్య 22న ఈఎంయూ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. వివరాలిలా వున్నాయి...

- ఈ నెల 22వ తేదీ రాత్రి 10.45 గంటలకు చెన్నై బీచ్‌ నుంచి గుమ్మిడిపూండి బయలుదేరే ఈఎంయూ (42831), రాత్రి 9.55 గంటలకు గుమ్మిడిపూండి నుంచి చెన్నై బీచ్‌కు బయలుదేరే ఈఎంయూ (42836) పూర్తిగా రద్దయ్యాయి. - 22వ తేదీ రాత్రి 11.20 గంటలకు మూర్‌మార్కెట్‌ కాంప్లెక్స్‌ నుంచి గుమ్మిడిపూండి బయలుదేరే ఈఎంయూ (42037) పొన్నేరి వరకు మాత్రమే వెళ్తుంది. - 23వ తేదీ వేకువజామున 3.50 గంటలకు గుమ్మిడిపూండి నుంచి మూర్‌మార్కెట్‌ కాంప్లెక్స్‌కు బయలుదేరాల్సిన ఈఎంయూ (42002) పొన్నేరి నుంచి బయలుదేరనుంది.

Updated Date - 2023-01-21T10:22:12+05:30 IST