NRI: ఎన్నారై ఘాతుకం.. క్యాన్సర్‌తో బాధపడుతున్న భార్య.. విదేశాల్లో చికిత్స చేయించాలని కోరినందుకు..

ABN , First Publish Date - 2023-01-15T12:40:23+05:30 IST

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది.

NRI: ఎన్నారై ఘాతుకం.. క్యాన్సర్‌తో బాధపడుతున్న భార్య.. విదేశాల్లో చికిత్స చేయించాలని కోరినందుకు..

అహ్మదాబాద్‌: గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న భార్య.. విదేశాల్లో చికిత్స చేయించాలని కోరినందుకు ఓ ఎన్నారై భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కిరణ్ భౌ (72), ఉషా భౌ(69) భార్యాభర్తలు. ఈ దంపదతులు కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో సుమారు 30 సంవత్సరాలు ఉండి, ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం అహ్మదాబాద్ ప్రహ్లాద్‌నగర్‌లోని ఒక ఇంట్లో ఉన్నారు. నాలుగు నెలల క్రితం వారు మకర్బాలోని ఆర్కిడ్ ఎక్సోటికా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు మారారు. అయితే, స్వదేశానికి వచ్చిన తర్వాత ఉషా గర్భశయ క్యాన్సర్ బారిన పడ్డారు. క్యాన్సర్ సోకిన ఆమె చికిత్స కోసం అమెరికాకు తిరిగి వెళ్దామంటూ భర్తను పలుమార్లు కోరింది. అందుకు కిరణ్ నిరాకరించాడు.

ఈ విషయమై గతకొంత కాలంగా దంపతుల మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి మరోసారి వారి మధ్య చికిత్స విషయమై మరోసారి ఘర్షణ జరిగింది. దాంతో కోపోద్రిక్తుడైన కిరణ్ భార్య ఉషాను కత్తితో పలుమార్లు పొడిచి అత్యంత కిరాతకంగా చంపేశాడు. అనంతరం గురువారం ఉదయం బంధువులకు ఉషా ఆత్మహత్య చేసుకుందంటూ సందేశం పంపించాడు. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రాణాలతోనే ఉన్న కిరణ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఉషా సోదరుడు మధుసూదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్ఖేజ్ పోలీసులు కిరణ్‌పై హత్య నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-15T12:40:25+05:30 IST