Crime: మాజీ ప్రేయసి ఫోన్ చేసి కలుద్దామనగానే.. అనుమానించకపోవడమే ఆ కుర్రాడి పొరపాటయింది.. కారులో కూర్చోగానే కూల్ డ్రింక్ ఇచ్చి..!
ABN , First Publish Date - 2023-06-26T17:00:24+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఇటీవల జరిగిన దేవాన్ష్ యాదవ్ హత్య మిస్టరీ వీడింది. దేవాన్ష్ యాదవ్ హత్యలో అతడి మాజీ ప్రియురాలు, ఆమె కొత్త బాయ్ఫ్రెండ్ నిందితులని పోలీసులు తేల్చారు. స్థానికంగా ఈ కేసు సంచలనం సృష్టించింది
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని వారణాసిలో ఇటీవల జరిగిన దేవాన్ష్ యాదవ్ హత్య మిస్టరీ (Death mystery) వీడింది. దేవాన్ష్ యాదవ్ హత్యలో అతడి మాజీ ప్రియురాలు (Ex-girl friend), ఆమె కొత్త బాయ్ఫ్రెండ్ నిందితులని పోలీసులు తేల్చారు. స్థానికంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. దేవాన్ష్ గతంలో అనుష్క అనే యువతితో ప్రేమాయణం సాగించాడు. వీరిద్దరూ చిన్న నాటి నుంచి స్నేహితులు. 12వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రెండు సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో సహజీవనం (Live-in) కూడా చేశారు.
ఇద్దరి మధ్య గొడవలు రావడం వల్ల విడిపోయారు. ఆ తర్వాత అనుష్క మరో యువకుడికి దగ్గరైంది. దేవాన్ష్ మాత్రం అనుష్కను మర్చిపోలేకపోయాడు. తనకు మళ్లీ చేరువ కావాల్సిందిగా అనుష్కను దేవాన్ష్ బతిమాలేవాడు. అందుకు అనుష్క అంగీకరించలేదు. దీంతో అనుష్కను దేవాన్ష్ వెంబడించేవాడు. అతడి టార్చర్ భరించలేక తన ప్రస్తుత బాయ్ఫ్రెండ్ రాహుల్ సేథ్తో కలిసి అనుష్క మర్డర్ స్కెచ్ వేసింది. వీరికి రాహుల్ స్నేహితుడు సదాబ్ సహకరించాడు. తమ ప్లాన్ ప్రకారం దేవాన్ష్ను మాట్లాడడానికని చెప్పి అనుష్క పిలిచింది (Crime News).
Gold: ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారుపై ఐటీ అధికారులకు డౌట్.. డిక్కీల్లో వెతికినా ఏమీ దొరక్క వదిలేద్దామనుకున్న తరుణంలో..!
ఒక చోటుకు వెళ్దామని చెప్పి కారులో ఎక్కించింది. ఆ కారును సదాబ్ నడిపాడు. వారిని వెనుక నుంచి స్కూటీ మీద రాహుల్ అనుసరించాడు. కారులో దేవాన్ష్కు అనుష్క మత్తు కలిపిన జ్యూస్ను ఇచ్చింది. అది తాగిన దేవాన్ష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడిని అలీనగర్కు తీసుకెళ్లి నడిరోడ్డు మీద తలపై కాల్చి చంపారు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి కాలువలో పడేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు సెల్ లోకేషన్ ఆధారంగా నిందితులను కనుగొన్నారు.