Bride: మే 20న పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. కాబోయే భార్య ఫోన్ చేసి మరీ పిలిచిందని హ్యాపీగా వెళ్లిన వరుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-05-16T16:13:43+05:30 IST

ఆ యువతికి పెళ్లి నిశ్చయమైంది.. ఈ నెల 20వ తేదీన పెళ్లికి ముహూర్తంగా నిర్ణయించారు.. ఇరు వైపుల వారు పెళ్లి పనులు చేసుకుంటున్నారు.. ఈ నెల 8వ తేదీన ఆ అమ్మాయి తనకు కాబోయే భర్తకు ఫోన్ చేసింది.. ఒకసారి మాట్లాడుకుందాం రమ్మని అడిగింది..

Bride: మే 20న పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. కాబోయే భార్య ఫోన్ చేసి మరీ పిలిచిందని హ్యాపీగా వెళ్లిన వరుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ఆ యువతికి పెళ్లి (Marriage) నిశ్చయమైంది.. ఈ నెల 20వ తేదీన పెళ్లికి ముహూర్తంగా నిర్ణయించారు.. ఇరు వైపుల వారు పెళ్లి పనులు చేసుకుంటున్నారు.. ఈ నెల 8వ తేదీన ఆ అమ్మాయి తనకు కాబోయే భర్తకు ఫోన్ చేసింది.. ఒకసారి మాట్లాడుకుందాం రమ్మని అడిగింది.. దీంతో ఆ యువకుడు సంతోషంగా ఆమెకు చెప్పిన చోటుకు వెళ్లాడు.. అక్కడ ఆ అమ్మాయితో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడు.. హఠాత్తుగా ఆ యువకుడు తుపాకీ తీసి ఆ వరుడిని కాల్చి చంపేశాడు.. రెండ్రోజుల తర్వాత అసలు విషయం బయటపడింది (Crime News).

జార్ఖండ్‌లోని (Jharkhand) సిమ్‌డేగా జిల్లా పరిధిలోని కొలెబిరాకు చెందిన రవి అనే యువకుడికి, సొందరి గ్రామానికి చెందిన గుడియా కుమారితో మే 20న వివాహం జరగాల్సి ఉంది. అయితే గుడియా ఎప్పట్నుంచో అశుతోష్ కుమార్ అనే యువకుడితో ప్రేమలో (Love Affair) ఉంది. విషయం తెలుసుకున్న గుడియా తల్లిదండ్రులు ఆమెను తిట్టి రవితో వివాహం నిశ్చయించారు. దీంతో గుడియా తన ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ నెల 8వ తేదీన రవికి గుడియా ఫోన్ చేసింది. మాట్లాడుకుందాం రమ్మని అడిగింది.

Husband: రాత్రి ఒంటి గంటకు స్టేషన్‌కు వచ్చాడో వ్యక్తి.. కంగారు పడుతూనే అతడు చెప్పింది విని పరుగులు తీసిన పోలీసులు.. అసలు కథేంటంటే..!

కాబోయే భార్య పిలవడంతో రవి సంతోషంగా ఆమె చెప్పిన చోటుకు బైక్‌పై వెళ్లిపోయాడు. అక్కడ గుడియాతో పాటు మరో ముగ్గురు యువకులు ఉన్నారు. ఆ ముగ్గురు రవిని తుపాకీతో కాల్చి చంపారు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. రెండ్రోజుల తర్వాత సెలఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితులు దొరికారు. మొత్తం నలుగురిని పోలీసులు అందుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Updated Date - 2023-05-16T16:13:43+05:30 IST