Kangana Ranaut: ఎమర్జెన్సీ సినిమాను పూర్తి చేయడానికి ఆస్తులను తనఖా పెట్టా

ABN , First Publish Date - 2023-01-21T19:09:15+05:30 IST

సమకాలీన అంశాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). బాలీవుడ్‌లో అభిమానులందరు ముద్దుగా ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. కంగన ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమాలో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తుంది.

Kangana Ranaut: ఎమర్జెన్సీ సినిమాను పూర్తి చేయడానికి ఆస్తులను తనఖా పెట్టా

సమకాలీన అంశాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). బాలీవుడ్‌లో అభిమానులందరు ముద్దుగా ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. కంగన ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమాలో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తుంది. ఈ అందాల భామ తాజాగా ఎమర్జెన్సీ షూటింగ్‌ను పూర్తి చేసింది. ఈ సందర్భంగా భావోద్వేగ లేఖను అభిమానులతో పంచుకుంది. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయడానికి తన ఆస్తులను తనఖా పెట్టాల్సి వచ్చిందని చెప్పింది.

కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమాలో ఇంధిరా గాంధీ పాత్రను పోషిస్తుంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తవడంతో అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్‌లో కంగన కెప్టెన్ కుర్చీలో కూర్చొని కనిపించింది. ‘‘నేను ఎమర్జెన్సీ చిత్రీకరణను పూర్తి చేశాను. నా జీవితంలోని ఓ అద్భుతమైన దశ ఈ మూవీ షూటింగ్‌తో పూర్తయింది. నేను ఈ సినిమా చిత్రీకరణలో ఎలాంటి ఇబ్బందులు పడలేదని అందరు భావిస్తున్నారు. కానీ, అది నిజం కాదు. చిత్రాన్ని పూర్తి చేయడానికి నా ఆస్తులను తనఖా పెట్టాల్సి వచ్చింది. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ సమయంలో నేను డెంగీ బారిన పడ్డాను. రక్తకణాల సంఖ్య పడిపోయింది. అయినప్పటికీ నేను షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో నా భావాలను చాలా స్వతంత్రగా తెలుపుతున్నాను కాబట్టే ఈ విషయాలను ఇక్కడ షేర్ చేస్తున్నాను. కలలను నిజం చేసుకోవడానికి కష్ట పడండి’’ అని కంగన చెప్పింది. ఎమర్జెన్సీ మాదిరి చిత్రంలో నటించడం తనకు పునర్జన్మ వంటిదని కంగన తెలిపింది. ఈ సందర్భంగా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించింది. ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఈ చిత్రంలో చూపించనున్నారు.

Updated Date - 2023-01-21T19:17:50+05:30 IST