Wife: బాత్రూంకు వెళ్లి వస్తానంటూ భర్తకు చెప్పి వెళ్లి.. ఎంతకూ తిరిగిరాని భార్య.. పెళ్లయిన 4 నెలల తర్వాత రెస్టారెంట్‌కు తీసుకెళ్తే..

ABN , First Publish Date - 2023-06-30T20:27:25+05:30 IST

ఆ వ్యక్తికి నాలుగు నెలల క్రితం వివాహం అయింది.. ఇటీవల భార్యను తీసుకుని సరదాగా టూర్‌కు వెళ్లాడు.. తిరిగి తిరిగి అలసి పోయిన ఇద్దరూ ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు.. భోజనం చేసిన తర్వాత బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి భార్య వెళ్లింది.. ఆమె ఎంతకూ తిరిగి రాలేదు.. చుట్టు పక్కల ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు..

Wife: బాత్రూంకు వెళ్లి వస్తానంటూ భర్తకు చెప్పి వెళ్లి.. ఎంతకూ తిరిగిరాని భార్య.. పెళ్లయిన 4 నెలల తర్వాత రెస్టారెంట్‌కు తీసుకెళ్తే..

ఆ వ్యక్తికి నాలుగు నెలల క్రితం వివాహం అయింది.. ఇటీవల భార్యను తీసుకుని సరదాగా టూర్‌కు వెళ్లాడు.. తిరిగి తిరిగి అలసి పోయిన ఇద్దరూ ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు.. భోజనం చేసిన తర్వాత బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి భార్య వెళ్లింది.. ఆమె ఎంతకూ తిరిగి రాలేదు.. చుట్టు పక్కల ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు.. దీంతో ఆ వ్యక్తి తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఆమెను వెతికి పట్టుకున్నారు.. భర్తకు సమాచారం అందించారు.. భర్త పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూడగా భార్య పక్కన మరో అమ్మాయి కూర్చుని ఉంది.. అసలు విషయం తెలుసుకుని ఆ భర్త షాకయ్యాడు.

బీహార్‌ (Bihar)లోని జముయికి చెందిన ఓ కరిష్మా కుమారి అనే మహిళ మే 9వ తేదీన తన భర్త సందీప్ కుమార్‌తో కలిసి జంగిల్ సఫారీకి వెళ్లింది. ఆ తర్వాత అతణ్ని ఓ రెస్టారెంట్‌లో వదిలి పారిపోయింది. సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. చివరకు ధన్‌బాద్‌లో కరిష్మాను పట్టుకున్నారు. కరిష్మా మరో అయిన రాఖీ కుమారితో ప్రేమలో పడి ఆమెతోనే కలిసి ఉంటోందని తెలుసుకుని షాకయ్యారు. ఆ విషయాన్ని ఆ మహిళ భర్తకు చెప్పడంతో అతడు కూడా షాకయ్యాడు. కరిష్మా, రాఖీ కుమారి చిన్నప్పటి నుంచి స్నేహితులు (Lesbian love story).

Success Story: కరోనా మార్చిన తలరాత.. మూడేళ్ల క్రితం వరకు పెయింటర్‌గా పనిచేసిన ఈ వ్యక్తే ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు..!

ఇద్దరూ పెద్దయ్యే వరకు కలిసే చదువుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. బాలికలిద్దరూ గతంలో కూడా ధన్‌బాద్ నుంచి పారిపోయారని బంధువులు తెలిపారు. ఆ తర్వాత కరిష్మాను పట్టుకుని సందీప్‌తో వివాహం చేశారు. అయినా ఆమె తన స్నేహితురాలు రాఖీ కుమారిని వదిలి ఉండలేకపోయింది. వివాహం జరిగిన మూడు నెలల తర్వాత ఆమె దగ్గరకు వెళ్లిపోయింది. తనకు భర్తతో ఉండాలని లేదని, రాఖీనే వివాహం చేసుకుంటానని కరిష్మా చెబుతోంది. తనను కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

Updated Date - 2023-06-30T20:28:55+05:30 IST