Husband: రాత్రి ఒంటి గంటకు స్టేషన్‌కు వచ్చాడో వ్యక్తి.. కంగారు పడుతూనే అతడు చెప్పింది విని పరుగులు తీసిన పోలీసులు.. అసలు కథేంటంటే..!

ABN , First Publish Date - 2023-05-16T13:24:35+05:30 IST

ఆ వ్యక్తి కామాంధుడు, అత్యంత కిరాతకుడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురితోనే శృంగారం సాగించాడు. 15 ఏళ్ల కూతురిని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం భార్యకు తెలిసి ప్రశ్నించింది. దీంతో అతనిలో కిరాతకుడు నిద్రలేచాడు.

Husband: రాత్రి ఒంటి గంటకు స్టేషన్‌కు వచ్చాడో వ్యక్తి.. కంగారు పడుతూనే అతడు చెప్పింది విని పరుగులు తీసిన పోలీసులు.. అసలు కథేంటంటే..!

ఆ వ్యక్తి కామాంధుడు, అత్యంత కిరాతకుడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురితోనే శృంగారం సాగించాడు. 15 ఏళ్ల కూతురిని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం భార్యకు తెలిసి ప్రశ్నించింది. దీంతో అతనిలో కిరాతకుడు నిద్రలేచాడు. భార్య నిద్రపోయిన తర్వాత ఆమె గొంతు కోసి చంపేశాడు. తల్లి గొంతు నుంచి రక్తం వస్తుండడం చూసి కేకలు వేసిన కూతురిని కూడా గొంతు కోసి చంపేశాడు (Man killed wife and daughter). అనంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. చివరకు ఏమనుకున్నాడో ఏమో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు (Crime News).

భార్య, కూతురిని దారుణంగా హత్య చేసిన దేవరామ్ మేఘ్వాల్ అనే వ్యక్తికి గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmedabad) జిల్లా రూరల్ కోర్టు జీవిత ఖైదు (Life Imprisonment) విధించింది. 2016లో బావ్లాలోని శాంతినగర్ సొసైటీలో నివాసం ఉన్న దేవరామ్.. తన భార్య, కుమార్తెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు తాను ధరించిన దుస్తులను కూడా తగలబెట్టాడు. తర్వాత మనసు మార్చుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగింది చెప్పాడు. కూతురితో తన బంధం గురించి ప్రశ్నించినందుకే భార్యను చంపేశానని అంగీకరించాడు. హత్య చూసిందనే కారణంతో కూతురిని చంపేశానన్నాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Viral Video: రియల్ హీరోవంటే నువ్వే బ్రదరూ.. వరదలో ఓ లేగదూడ కొట్టుకుని పోతోంటే ఈ కుర్రాడు ఏం చేశాడో మీరే చూడండి..!

ఈ కేసును అహ్మదాబాద్ రూరల్ కోర్టు (Court) దాదాపు ఏడేళ్ల పాటు విచారించింది. దేవరామ్ నేరాలు రుజువైనందున నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును (Verdict) ప్రకటించింది. కాగా, దేవరామ్‌కు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు, కొడుకు ప్రస్తుతం తాతగారి ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఘటన జరిగినపుడు కూడా వారు తాతగారి ఇంట్లోనే ఉన్నారు.

Updated Date - 2023-05-16T13:24:35+05:30 IST