Viral Video: ఐపీఎల్ మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లి.. స్టేడియంలోనే ఓ కుర్రాడి వింత నిర్వాకం.. ఓ వ్యక్తి చాటుగా వీడియో తీయడంతో..

ABN , First Publish Date - 2023-05-15T15:45:03+05:30 IST

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దాదాపు నెలన్నరగా జరుగుతున్న లీగ్ తుది దశకు చేరుకుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్ ప్రేక్షకులు స్టేడియంలకు క్యూ కడుతున్నారు.

Viral Video: ఐపీఎల్ మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లి.. స్టేడియంలోనే ఓ కుర్రాడి వింత నిర్వాకం.. ఓ వ్యక్తి చాటుగా వీడియో తీయడంతో..

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL 2023) ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దాదాపు నెలన్నరగా జరుగుతున్న లీగ్ తుది దశకు చేరుకుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్ ప్రేక్షకులు స్టేడియంలకు క్యూ కడుతున్నారు. తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) ఓ వ్యక్తి చేసిన పని మాత్రం షాకింగ్‌గా ఉంది. ఆ వ్యక్తి ఢిల్లీలో ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరయ్యాడు.

మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ (DCvsCSK) జట్లు తలపడుతున్నాయి. ఆ వ్యక్తి టికెట్ తీసుకుని స్టేడియానికి వచ్చాడు. ఖాళీగా ఉన్న కుర్చీలో పడుక్కుని మొబైల్ (Mobile) చూసుకుంటున్నాడు. ఇంతకీ ఆ మొబైల్‌లో ఏం చూస్తున్నాడో తెలుసా? మైదానంలో ప్రత్యక్షంగా జరుగుతున్న మ్యాచ్‌ను మొబైల్‌లో ``జియో సినిమా`` (Jio Cinema) యాప్‌లో చూస్తున్నాడు. ఓ వ్యక్తి ఆ ఘటనను తన మొబైల్‌లో బంధించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Groom Video: పెళ్లి వేదికపై ఈ వరుడి వ్యవహారం మామూలుగా లేదుగా.. వధువు మొహమాట పడుతున్నా అస్సలు ఆగడం లేదు.. చివరకు..!

ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ``రాత్రి 12 గంటల్లోపు డేటాను పూర్తి చేయాలనే ఒత్తిడి వల్ల ఆ వ్యక్తి మ్యాచ్‌ను అలా చూస్తున్నాడేమో`, ``అతనికి షార్ట్ సైట్ ఉందేమో`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు. చాలా మంది లాఫింగ్ ఎమోజీలతో స్పందించారు.

Updated Date - 2023-05-15T15:45:03+05:30 IST