మద్యం మత్తులో బిర్యానీ ఆర్డర్ చేసిన యువతి.. జొమాటో బిల్ చూసి షాక్.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2023-01-23T21:21:43+05:30 IST

ముంబైకి చెందిన ఆ యువతి ఫుల్‌గా మద్యం సేవించింది.. ఆ మత్తులోనే మొబైల్ తీసి జోమాట్ ఓపెన్ చేసి బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది.. తర్వాతి రోజు ఉదయం లేచి చూడగా బిర్యానీ ఖరీదు రూ.2500 అని ఉంది.. అంత ఖరీదు ఎందుకంటే ఆమె మద్యం మత్తులో బెంగళూరులోని ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసింది..

మద్యం మత్తులో బిర్యానీ ఆర్డర్ చేసిన యువతి.. జొమాటో బిల్ చూసి షాక్.. అసలు కథేంటంటే..

ముంబైకి చెందిన ఆ యువతి ఫుల్‌గా మద్యం సేవించింది.. ఆ మత్తులోనే మొబైల్ తీసి జోమాట్ ఓపెన్ చేసి బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది.. తర్వాతి రోజు ఉదయం లేచి చూడగా బిర్యానీ ఖరీదు రూ.2500 అని ఉంది.. అంత ఖరీదు ఎందుకంటే ఆమె మద్యం మత్తులో బెంగళూరులోని ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసింది.. (Mumbai Girl In Drunk state Ordered Biryani from Bengaluru).. తర్వాతి రోజు మధ్యాహ్నం ఆమెకు ఫుడ్ డెలివరీ జరిగింది.. ఆ ఘటన మొత్తాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ముంబైకి చెందిన యువతి మద్యం మత్తులో ఈనెల 21వ తేదీన జొమాటో ద్వారా బెంగళూరులోని మేఘనా ఫుడ్స్‌ నుంచి బిర్యానీ ఆర్డర్‌ చేసుకుంది. జొమాటో సంస్థ కొన్ని నెలలుగా Intercity Legends service అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఆర్డర్ చేసిన బిర్యానీ ధర ఏకంగా రూ.2500. మత్తు దిగాక బిల్లు చూసిన యువతి షాకైంది. తర్వాతి రోజు (జనవరి 22) ఆమెకు ఫుడ్‌ డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని సదరు యువతి సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. నేను బెంగళూరు నుంచి రూ.2,500 విలువైన బిర్యానీని ఆర్డర్‌ చేశానా..? అని పోస్టు చేసింది.

ఆ యువతి ట్వీట్‌కు జొమాటో (Zomato) స్పందించింది. ఆర్డర్‌ మీ ఇంటికి చేరాకా.. మీ అనుభవం గురించి తెలియజేయండి అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. దానికి ఆ యువతి స్పందిస్తూ.. తన జీవితంలో అదే ఉత్తమ నిర్ణయమని, బిర్యానీ చాలా బాగుందని రిప్లై ఇచ్చింది. ఆ యువతి ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2023-01-23T21:21:45+05:30 IST