Share News

Crime: 10 నెలల మనవడిని చంపేసి.. ఇంటి పక్కన పూడ్చిపెట్టిందో నాయనమ్మ.. పోలీసుల ఎంట్రీతో అసలు నిజం బయటకు..!

ABN , First Publish Date - 2023-11-27T16:25:03+05:30 IST

సాధారణంగా నాయనమ్మ లేదా అమ్మమ్మలకు మనవళ్లంటే ఎంతో ప్రేమ ఉంటుంది. కడుపున పుట్టిన పిల్లల కంటే వారి పిల్లలపై ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. వారి మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ నాయనమ్మ కిరాతకంగా ప్రవర్తించింది.

Crime: 10 నెలల మనవడిని చంపేసి.. ఇంటి పక్కన పూడ్చిపెట్టిందో నాయనమ్మ.. పోలీసుల ఎంట్రీతో అసలు నిజం బయటకు..!

సాధారణంగా నాయనమ్మ లేదా అమ్మమ్మలకు మనవళ్లంటే ఎంతో ప్రేమ ఉంటుంది. కడుపున పుట్టిన పిల్లల కంటే వారి పిల్లలపై ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. వారి మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటారు. అయితే కర్ణాటక (Karnataka)కు చెందిన ఓ నాయనమ్మ కిరాతకంగా ప్రవర్తించింది. అభం శుభం తెలియని 10 నెలల మనవడిని (Grand Son) కిరాతకంగా చంపేసింది. ఎలాంటి సాక్ష్యం దొరక్కుండా ఉండేందుకు ఇంటి పక్కన ఉన్న మామిడి తోటలో పూడ్చేసింది. ఆమె ఎందుకలా చేసిందో తెలిస్తే మాత్రం షాక్ అవక తప్పదు (Crime News).

కర్ణాటకకు చెందిన సరోజా గూలీ అనే మహిళ కుమారుడు కళాకేష్ 2021లో నాగరత్న నాగరత్న అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి 2023లో అద్విక్ అనే బాబు జన్మించాడు. ప్రసవం కోసం కొన్ని నెలల పాటు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన నాగరత్న కొద్దిరోజుల క్రితమే అత్తమామల ఇంటికి వచ్చింది. ఈ నెల 22వ తేదీన నాగరత్న ఇంటి పనులు ముగించుకుని వచ్చే సమయానికి బాబు కనిపించలేదు. అత్తను అడిగితే తనకు తెలియదని చెప్పింది. చుట్టు పక్కల ఎంత వెతికినా బాబు ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు (Grand Mother killed Grand Son).

Viral News: ఒక్క ఐడియా.. ఈమె జీవితాన్నే మార్చేసింది.. ఇంట్లోంచి కాలు బయటకు పెట్టకుండానే లక్షలు సంపాదిస్తోంది..!

ఆ సమయంలో ఇంట్లో ఉన్న సరోజను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో సరోజ నిజం అంగీకరించింది. తన మనవడిని తానే గొంతు పిసికి చంపేసినట్టు చెప్పింది. మృతదేహాన్ని ఇంటి పక్కన మామడి తోటలో పాతి పెట్టినట్టు చెప్పింది. కోడలి మీద కోపంతోనే అలా చేసినట్టు సరోజ తెలిపింది. సరోజ చెప్పిన చోట తవ్వి అద్విక్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరోజను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2023-11-27T16:25:06+05:30 IST