Kohli Anushka: లండన్‌ పర్యటనలో కోహ్లీ- అనుష్క శర్మ బిజిబిజి.. వీడియో, ఫోటోలు వైరల్...

ABN , First Publish Date - 2023-06-18T20:00:46+05:30 IST

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) లండన్‌లో పర్యటిస్తూ బిజిబిజిగా గడుపుతున్నారు.

Kohli Anushka: లండన్‌ పర్యటనలో కోహ్లీ- అనుష్క శర్మ బిజిబిజి.. వీడియో, ఫోటోలు వైరల్...

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) లండన్‌లో పర్యటిస్తూ బిజిబిజిగా గడుపుతున్నారు. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు ఇంగ్లాండ్ రాజధాని లండన్ నగరంలో ఉన్న కృష్ణ దాస్ 'కీర్తన'లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షేర్ చేసిన క్లిప్‌లలో ఈ జోడీ తమ సీట్లలో కూర్చుంటున్న దృశ్యాలను చూడవచ్చు. కృష్ణ దాస్ తన హిందూ భక్తి పాటలకు ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత అమెరికన్ గాయకుడు అని గమనించాలి. గత ఏడాది కూడా దాస్ 'కీర్తన'కు కోహ్లీ, అనుష్క హాజరయ్యారు.

స్టార్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో ఒకడుగా ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 252 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో, కోహ్లి సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్‌లను కలిగి ఉన్నాడు.

స్టాక్ గ్రో నివేదిక ప్రకారం కోహ్లీ నికర విలువ రూ. 1,050 కోట్లు, ఇది ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెటర్లలో అత్యధికంగా ఉంది. 34 ఏళ్ల అతను తన "A+" టీమ్ ఇండియా కాంట్రాక్ట్ ద్వారా రూ.7 కోట్లు సంపాదిస్తున్నాడు. ఒక్కో టెస్టుకు అతని మ్యాచ్ ఫీజు రూ. 15 లక్షలు, వన్డే రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు ఉంది.

అలాగే భారత మాజీ కెప్టెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒప్పందం ద్వారా ఏటా రూ. 15 కోట్లు సంపాదిస్తున్నాడు. వెస్టిండీస్‌లో జరగనున్న భారత పర్యటనలో అతను తిరిగి మైదానంలోకి వస్తాడని భావిస్తున్నారు.

Updated Date - 2023-06-18T20:08:04+05:30 IST