TS News: వికారాబాద్‌లో 19 ఏళ్ల యువతి దారుణహత్య

ABN , First Publish Date - 2023-06-11T16:08:46+05:30 IST

మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని పెద్దలు చెప్పిన మాట. అనాధిగా ఇక్కడ స్త్రీలను గౌరవిస్తూ పూజిస్తూ వస్తున్నారు.

TS News: వికారాబాద్‌లో 19 ఏళ్ల యువతి దారుణహత్య

వికారాబాద్: మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని పెద్దలు చెప్పిన మాట. అనాధిగా ఇక్కడ స్త్రీలను గౌరవిస్తూ పూజిస్తూ వస్తున్నారు. అంతెందుకు దేశాన్ని భరతమాతగా కొలుస్తున్నాం. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఆకృత్యాలకు గురవుతూనే ఉన్నారు. ఐదేళ్ల పసిపాపల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు నిత్యకృత్యమైపోయాయి. నానాటికి మహిళలపై గృహహింసతో పాటు అనేక రూపాల్లో లైంగికంగా మానిసిక వేధింపులకు గురవుతున్నారు. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న హింస పరాకాష్టకు చేరింది.

హైదరాబాద్‌లో అప్సర (Apsara) దారుణహత్య మరువకముందే మరో దారుణ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఓ యువతిని గుర్తుతెలియని దారుణంగా హత్య చేసి నీటి గుంటలో పడేసి పరారయ్యారు. వికారాబాద్ జిల్లా (Vikarabad District) పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) అనే యువతి దుండగులు హత్య చేశారు. శనివారం రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి శిరీష బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. ఈ రోజు మధ్యాహ్నం కుంట అంచున యువతి దుస్తులను స్థానికుల కంట పడ్డాయి. అనుమానంతో కుంటలో శిరీష కోసం వెతికారు. కుంటలో యువతి మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలాన్ని పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి పరిశీలించారు. యువతి మృతదేహంపై కత్తిగాట్లను పోలీసులు గుర్తించారు. సమగ్ర విచారణ చేసి నిందితులను గుర్తించి శిక్షస్తామన్న డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2023-06-11T16:09:05+05:30 IST