గిరిజన సంక్షేమమే లక్ష్యం

ABN , First Publish Date - 2023-05-03T22:16:37+05:30 IST

గిరిజన సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమ ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు.

 గిరిజన సంక్షేమమే లక్ష్యం
మామిడిపల్లిలో రోడ్డు పనులకు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

దండేపల్లి, మే 3: గిరిజన సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమ ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. పాత మామిడిపల్లి నుంచి కంయరబాయి వరకు బుధవారం కోటి 83లక్షల రూపాయలు ఎస్‌టీడీఎఫ్‌ నిధులతో చేపట్టే బీటి రోడ్డు పనులకు మండల ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గిరిజన తండా అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రైతు సమ న్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ గురువయ్య, సర్పంచులు శ్యామల, రాజయ్య, ఎంపీటీసీ ఎలైపు శిరీష-సుబాష్‌, ఉప సర్పంచు నలిమెల మహేష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయ కులు తిరుపతి, శ్రీనివాస్‌, శంకర్‌రావు సత్యం, వేణు, రామస్వామి, అజయ్‌ గౌడ్‌, లక్ష్మణ్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-03T22:16:37+05:30 IST