tenth paper leakage case: టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మరో ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-04-06T15:24:32+05:30 IST

టెన్త్ పేపర్ లీకేజీ కేసు (tenth paper leakage case)లో మరో ట్విస్ట్.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

tenth paper leakage case: టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మరో ట్విస్ట్..

హనుమకొండ: టెన్త్ పేపర్ లీకేజీ కేసు (tenth paper leakage case)లో మరో ట్విస్ట్.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పరీక్ష రాసేందుకు వచ్చిన బాలుడు టెన్త్ పేపర్ లీకేజీకి కారణమయ్యాడని పోలీసులు తెలిపారు. డీబార్ అయ్యావని చెప్పి.. బాలుడిని అధికారులు బయటకు పంపించారని విచారణలో వెల్లడైంది. కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) ప్రభుత్వాన్ని అసమర్థంగా చూపడానికి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేయడానికి ప్రయత్నించారని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ (Ranganath) వెల్లడించారు. మంగళవారం నాటి పదోతరగతి హిందీ పేపర్‌ లీకేజీలో బండి సంజయ్‌, బీజేపీ కార్యకర్త ప్రశాంత్‌ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం నుంచే వాట్సాప్ లో సుదీర్ఘంగా చాటింగ్‌ చేశారని, వాట్సాప్‌ కాల్స్‌ మాట్లాడుకున్నారన్నారు. ఆ తర్వాతే హిందీ పేపర్‌ లీకేజీకి కుట్ర పన్నారని తెలిపారు. ఆ మేరకు ఆధారాలు లభించాయన్నారు.

బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశ్నపత్రం లీకేజీ తీరు, బండి సంజయ్‌ అరెస్టుకు కారణాలను సీపీ రంగనాథ్‌ వివరించారు. మంగళవారం జరిగిన పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం కమలాపూర్‌ మండల కేంద్రంలోని స్కూల్‌ నుంచి బయటకు వచ్చిందన్నారు. రిమాండ్‌ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ1గా, ప్రశాంత్‌ను ఏ2గా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేశామని సీపీ తెలిపారు.

Updated Date - 2023-04-06T16:14:21+05:30 IST