Home » Police
తెలంగాణలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు హోరాహోరీగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేశాయి. అయితే ఈ ప్రచారంలో అక్కడక్కడ పలు ఘర్షణలు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో ఈ నెల 9వ తేదీన భారీ రోడ్ షో నిర్వహించారు.
లోక్ సభ ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ఉదృతం చేసింది ఎన్నికల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ (BJP) ‘‘భాగ్యనగర్ జనసభ’’కు పిలుపునిచ్చిది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు (Rajasingh) చేదు అనుభవం ఎదురైంది.
Andhrapradesh: ఏపీలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అలాగే పోలింగ్ ఏజెంట్ల నియామకం విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. సహజంగా పోలింగ్ బూత్లలో పోలింగ్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లను ఏజెంట్లు గుర్తించిన తర్వాతే వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తారు పోలింగ్ సిబ్బంది.
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ సిటీలో పర్యటనకు అధికారులు అడ్డంకులు ఏర్పరిచారు. ప్రచారం చివరి రోజున కాకినాడలో పవన్ రోడ్ షో, సభకు టీడీపీ, జనసేన పార్టీలు దరఖాస్తు చేశాయి. అయితే అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు పేర్కొంటూ పవన్ పర్యటనకు అనుమతి నిరాకరించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించి, వీడియో వైరల్ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు... నిందితుల అరెస్టుపై పట్టు వదలడం లేదు. ఈ కేసు విషయమై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన రోడ్ షో యావత్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించేందుకే కేటాయించారు. మేమంతా సిద్ధం పేరిట కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం ఆయన పర్యటించారు. భైరవాన తిప్ప ప్రాజెక్టుకు కృష్ణాజలాల తరలింపు, 114 చెరువులకు నీరు వంటి గత ఎన్నికల హామీలను విస్మరించిన ఆయన.. ఈ ఎన్నికల్లో వాటి ప్రస్థావనే తేలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తారో కూడా చెప్పలేదు. ‘మీ బిడ్డ మంచి చేసి ఉంటే చేతులెత్తండి’ అని పదే పదే వైసీపీ ...
Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి టీపీసీసీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అమిత్ షా వీడియో మార్కింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల వేధింపులపై కోర్టు దృష్టికి టీపీసీసీ తీసుకెళ్లింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 29 మంది సెక్రటరీల నివాసాలకు ఢిల్లీ పోలీసులు వెళ్లారు.
ఎన్నికల నేపధ్యంలో భాగంగా బాచుపల్లి ఎస్ఓటీ, బాలానగర్ పోలీసులు(Bachupally SOT, Balanagar Police) సంయుక్తంగా వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ. 22 లక్షలను పోలీసులు గురువారం పట్టుకున్నారు.
ఏపీలో ఎన్నికల(ap elections 2024) ఓటింగ్కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. సమయం తక్కువగా ఉండటంతో ఓటర్లకు నగదును(cash) పంచేందుకు పలు పార్టీలు పెద్ద ఎత్తున నగదును పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల దృష్ట్యా పోలీసు బృందాల పెట్రోలింగ్, తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట పరిధిలో భారీగా నగదును పట్టుకున్నారు.