Share News

TS Election: తెలంగాణ బర్రెలక్కకు లక్ష రూపాయల విరాళం

ABN , First Publish Date - 2023-11-18T20:53:30+05:30 IST

తెలంగాణ బర్రెలక్క (శిరీష) ( Barrelakka (Shirisha) ) కు మద్దతుగా యానాం మాజీ మంత్రి, ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ( Malladi Krishna Rao ) లక్ష రూపాయలు విరాళంగా పంపించారు.

TS Election: తెలంగాణ బర్రెలక్కకు లక్ష రూపాయల విరాళం

హైదరాబాద్: తెలంగాణ బర్రెలక్క (శిరీష) ( Barrelakka (Shirisha) ) కు మద్దతుగా యానాం మాజీ మంత్రి, ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ( Malladi Krishna Rao ) లక్ష రూపాయలు విరాళంగా పంపించారు. తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేస్తున్నారు. తెలంగాణలో బర్రెలక్కగా శిరీష ఫేమస్ అయ్యారు. శిరీషతో ఫోనులో మాట్లాడి మల్లాడి కృష్ణారావు అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ..‘‘ తెలంగాణ రాష్ట్ర కొల్లాపూర్ నియోజకవర్గ ఓటరు మహాశయులారా పేద కుటుంబం నుంచి వచ్చిన బర్రెలక్క శిరీష్‌కు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి రాజకీయాలల్లో ప్రశ్నించే శిరీష లాంటి వాళ్లు ముందుకు వస్తే మీ భవిష్యత్తు మారుతుంది.. నీ గెలుపు నేను కోరుకుంటున్నాను. నీ ప్రచార ఖర్చుల కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. నీ గెలుపు నేను కోరుకుంటున్నాను. ఒక వేళ అపజయం కలిగితే కృంగిపోవద్దు. ఉన్నత చదువులు చదువుకుంటే ఆర్థిక సహాయం అందజేస్తా’’ అని మల్లాడి కృష్ణారావు అభయం ఇచ్చారు.

Updated Date - 2023-11-18T20:54:39+05:30 IST