Share News

Telangana Polls: బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆందోళన.. ఆలేరులో పరిస్థితి ఉద్రిక్తం

ABN , First Publish Date - 2023-11-30T14:28:01+05:30 IST

యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు.

Telangana Polls: బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆందోళన.. ఆలేరులో పరిస్థితి ఉద్రిక్తం

యాదాద్రి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి(Yadadri Dist) జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత(Gongidi Sunitha) భర్త మహేందర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ (Congress)నేతలు నిరసనలకు దిగారు.

సునీత భర్త కారుపై రాళ్ల దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి జోక్యంతో ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు భువనగిరిలో 34%, ఆలేరు 47% పోలింగ్ పూర్తయింది.

Updated Date - 2023-11-30T14:28:52+05:30 IST