Home » Yadadri Bhuvanagiri
తెలంగాణలో మొదటి బర్డ్ఫ్లూ కేసు నమోదైంది. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్లలోని ఓ కోళ్లఫారమ్లోని కోళ్లకు బర్డ్ఫ్లూ పాజిటివ్గా శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బుధవారం తెల్లవారుజామున ఐదున్నరకు భువనగిరి పట్టణంలో బస్తీ పర్యటన చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని కోళ్ల ఫాంలో శనివారం వెయ్యి బ్రాయిలర్ కోళ్లు మృతి చెందాయి. ఆకస్మికంగా కొళ్లు మృత్యువాతపడడంతో ఆందోళనకు గురైన రైతు పశువైద్యాధికారికి సమాచారం ఇచ్చాడు.
మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన తండ్రి.. పాఠశాల నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చావగొట్టాడు. భార్య వేడుకున్నా వినకుండా రెచ్చపోయి చివరికి పిల్లాడి ఛాతీపై తన్నాడు.
తెలంగాణ: చౌటుప్పల్ మండలం ఆరేగూడెంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ బాలుడి విషయంలో కన్న తండ్రే కాలయముడు అయ్యాడు. చిన్న పొరపాటుకు ఆగ్రహించిన సదరు తండ్రి తీరు కుమారుడి ప్రాణాలు పోయేలా చేసింది.
ఏడాదిగా తనతో స్నేహంగా ఉంటున్న సహోద్యోగిని తాము పని చేసే కంపెనీలో తనపై ఫిర్యాదు చేసిందనే ఆందోళనతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
భూమికి భూమి ఇవ్వాలని, లేదంటే మార్కెట్ ధర చెల్లించాలని, దక్షిణ భాగంలో అలైన్మెంట్ మార్చాలనే డిమాండ్తో ఆర్ఆర్ఆర్ నిర్వాసిత రైతులు శనివారం యాదాద్రి కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు.
వినతులు, ఆవేదనలు, అసంతృప్తులు, ఆగ్రహాలు, నిరసనలు, ఆనందాలు! ఇలా పథకాల్లో తమ పేర్ల నమోదుకు సంబంధించి ఆశావహుల ద్వారా గ్రామసభల్లో వ్యక్తమైన రకరకాల భావోద్వేగాలు!!
MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీని ఏటీఎంగా మార్చుకొని వచ్చిన డబ్బులను ఢిల్లీ పంపిస్తున్నారని ఆరోపించారు. రౌడీ మూకలతో దాడులు చేసే సంస్కృతి బీఆర్ఎస్ది కాదన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా మా జోలికి వస్తే ఖబడ్దార్’’ అంటూ హెచ్చరించారు.
ఓ యువకుడు బ్రెయిన్డెడ్ కావడంతో అతడి అవయవాలను మరో ఎనిమిది మందికి దానం చేసి కుటుంబసభ్యులు ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.