Etala Rajender: ఎమ్మెల్యే ఈటల సంచలన కామెంట్స్.. కేసీఆర్‌ను బొందపెట్టే టైమొచ్చింది..

ABN , First Publish Date - 2023-08-25T13:18:55+05:30 IST

సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే

Etala Rajender: ఎమ్మెల్యే ఈటల సంచలన కామెంట్స్.. కేసీఆర్‌ను బొందపెట్టే టైమొచ్చింది..

- బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం వల్లకాడే

- బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌

- ‘ఎన్‌కౌంటర్‌’ పదం కడియం పుణ్యమే: ఎమ్మెల్యే రఘునందన్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌(జనగామ): సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(Huzurabad MLA Etala Rajender) అన్నారు. జనగామజిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో గురువారం నిర్వహించిన నియోజకవర్గ బూత్‌ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాటలకు చేతలకు సంబంధంలేని వ్యక్తి కేసీఆర్‌ అని విమర్శించారు. అటుకులు బుక్కి ఉపాసమున్న కేసీఆర్‌ పదేళ్ల కాలంలో లక్షలకోట్లకు అధిపతి ఎలా అయ్యారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అకౌంట్‌లో 850కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.30 కోట్లమేర నిల్వచేశాడని ఆరోపించారు. రాష్ట్రంలో దళిత జనాభా 17శాతం ఉంటే వారిని వదిలేసి 0.6శాతం ఉన్న వారికి కీలక మంత్రి పదువులు ఇచ్చారని అన్నారు. 11శాతం ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్‌ఎస్‏లో ఒక్క ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో కాని, రాష్ట్రంలో కాని బీ ఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీష్‏రావు(KCR, KTR, Kavitha, Harish Rao)లే బాగుపడతారని, బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యుడు సీఎం అవుతారని అన్నారు.

టీ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిన చరిత్ర బీజేపీదని గుర్తు చేశారు. దశాబ్ధి ఉత్సవాల పేరట జీపీలు, మునిసిపాలిటీలలో డబ్బులు డ్రా చేసి దావతులు పెట్టించిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో ధరణి పేరుతో లక్షలకోట్ల విలువైన ప్రభుత్వ భూములను బడాబాబులకు ధారాదత్తం చేసి లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి ఓటుకు రూ.20వేలు తీసుకోవాలని, ఓటు మాత్రం నచ్చినవారికి వేసుకోవాలన్నారు. పోలీసులను కేవలం ఎమ్మెల్యేలకు బానిసలుగా పని చేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప దుర్మార్గాలను అరికట్టడానికి కాదన్నారు. ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగితే తెలంగాణ వల్లకాడుగా మారుతుందని, బీజేపీని గెలిపిస్తే స్వర్ణయుగం వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రె్‌సకు ఓటు వేసినా బీఆర్‌ఎస్‏కు వేసినట్లేనని, అందువల్ల ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.

‘ఎన్‌కౌంటర్‌’ పదం కడియం పుణ్యమే..

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్‌ అనే పదాన్ని రాష్ట్రంలో విస్తృత ప్రాచుర్యం చేసిన పెద్ద నాయకుడు కడియం శ్రీహరని అని ఎద్దేవా చేశారు. కడియం బ్రహ్మ పదార్ధం కాదు అని ఆయన ఓడిపోవడం కొత్తేమి కాదన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో నై తెలంగాణ అన్న కడియంను చిత్తుగా ఓడగొట్టామన్నారు. 30 ఏళ్ల పాటు రాజకీయంగా ఎదోపదవిలో ఉన్న కడియం ఘన్‌పూర్‌కు చేసింది ఏమీలేదన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పల్లాకు, మల్లాకు ప్రైవేట్‌ యూనివర్సీటీలు మంజూరి చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదాసు వెంకటేష్‌, మాజీ మంత్రి గుండె విజయరామరావు, ప్రేమేందర్‌ రెడ్డి, దిలీ్‌పకుమార్‌, చింత సాంబమూర్తి పాల్గొన్నారు.

raje.jpg

Updated Date - 2023-08-25T13:22:39+05:30 IST