MLA Rajasingh: దళితబంధులో అవినీతిపై ఫైర్‌

ABN , First Publish Date - 2023-07-24T22:50:42+05:30 IST

దళితబంధులో(Dalit Bandhu) అవినీతి( corruption)పై సీఎం కేసీఆర్‌(CM KCR)పై ఎమ్మెల్యే రాజాసింగ్‌(MLA Rajasingh) ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Rajasingh: దళితబంధులో అవినీతిపై ఫైర్‌

హైదరాబాద్: దళితబంధులో(Dalit Bandhu) అవినీతి( corruption)పై సీఎం కేసీఆర్‌(CM KCR)పై ఎమ్మెల్యే రాజాసింగ్‌(MLA Rajasingh) ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధులో అవినీతి నియంత్రణకు.. కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. దళితబంధులో కమీషన్లకు అడ్డుకట్ట వేయటానికి.. టాస్క్ఫోర్స్(Task Force) ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులే అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దళిత సోదరులకు న్యాయం జరగాలనేదే తమ ఆకాంక్షని తెలిపారు. ఎన్నికల కోసం దళితబంధును BRS వాడుకుంటోందని అన్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే నిఘా పెట్టి దళితబంధులో అవినీతి లేకుండా అర్హూలందరికి అందజేయాలని రాజాసింగ్‌ కోరారు.

Updated Date - 2023-07-25T01:28:54+05:30 IST