Hyderabad: నేషనల్‌ పోలీస్ అకాడమీలో దొంగతనం

ABN , First Publish Date - 2023-01-13T10:42:49+05:30 IST

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ పోలీస్ అకాడమీ (National Police Academy)లో దొంగతనం జరిగింది.

Hyderabad: నేషనల్‌ పోలీస్ అకాడమీలో దొంగతనం

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ పోలీస్ అకాడమీ (National Police Academy)లో దొంగతనం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపీఎస్ (IPS) ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (Training Institute) అకాడమీలో ఉన్న కంప్యూటర్లు మాయమయ్యాయి. భద్రతా బలగాల కళ్లు గప్పి కేటుగాడు చాకచక్యంగా 7 కంప్యూటర్లు (7 Computers) మాయం చేశాడు. కంప్యూటర్లు మాయం అయిన విషయాన్ని గమనించిన అధికారులు.. ఇది ఇంటి దొంగ పనేనని భావించారు. సీసీటీవీ కెమెరాలను అధికారులు పరిశీలించారు. దొంగతనం దృశ్యాలు పుటేజ్‌లో రికార్డు అయ్యాయి. అకాడమీలో ఐటి సెక్షన్‌లో పని చేస్తున్న చంద్రశేఖర్‌గా గుర్తించారు. దీంతో ఎన్‌పీఏ (NPA) అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-01-13T10:42:53+05:30 IST