కాడ్లాపూర్‌ యువతి హత్య కేసులో ట్విస్ట్...

ABN , First Publish Date - 2023-06-12T09:46:27+05:30 IST

పరిగి మండలం కాడ్లాపూర్‌లో శిరీష అనే యువతి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. యువతి మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాత్రి పోస్ట్ మార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పజెప్పారు. యువతిపై అత్యాచారం అనంతరం హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాడ్లాపూర్‌ యువతి హత్య కేసులో ట్విస్ట్...

వికారాబాద్ : పరిగి మండలం కాడ్లాపూర్‌లో శిరీష అనే యువతి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. యువతి మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాత్రి పోస్ట్ మార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పజెప్పారు. యువతిపై అత్యాచారం అనంతరం హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాడీని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు కాడ్లాపూర్ వచ్చారు. అంతకు ముందే అంత్యక్రియలకు శిరీష కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. బాడీని ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌లో అప్సర (Apsara) దారుణహత్య మరువకముందే మరో దారుణ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఓ యువతిని గుర్తుతెలియని దారుణంగా హత్య చేసి నీటి గుంటలో పడేసి పరారయ్యారు. వికారాబాద్ జిల్లా (Vikarabad District) పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) అనే యువతి దుండగులు హత్య చేశారు. శనివారం రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి శిరీష బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. ఈ రోజు మధ్యాహ్నం కుంట అంచున యువతి దుస్తులను స్థానికుల కంట పడ్డాయి. అనుమానంతో కుంటలో శిరీష కోసం వెతికారు. కుంటలో యువతి మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-06-12T09:46:27+05:30 IST