గ్రామపంచాయతీ సిబ్బంది భిక్షాటన

ABN , First Publish Date - 2023-03-13T00:53:17+05:30 IST

గ్రామ పంచాయతీ సిబ్బందిపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ, మండలంలోని కనగర్తిలో ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బంది భిక్షాటన చేశారు.

గ్రామపంచాయతీ సిబ్బంది భిక్షాటన
కనగర్తిలో నిరసన వ్యక్తం చేస్తున్న సిబ్బంది

ఓదెల, మార్చి 12: గ్రామ పంచాయతీ సిబ్బందిపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ, మండలంలోని కనగర్తిలో ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బంది భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు చితికేసి ప్రభాకర్‌ మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందు లకు గురిచేస్తున్నారని తెలిపారు. గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాన్ని 26వేల రూ పాయలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాల యం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శనిగరపు బాపు, తాళ్లపల్లి శంకర్‌, పైడపల్లి నాగయ్య, జాకీర్‌, శ్రీనివాస్‌, రాజయ్య, శంకర్‌, రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-13T00:53:17+05:30 IST