పోషణ్‌ అభియాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2023-09-05T00:18:44+05:30 IST

జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సం క్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని పకడ్భందీగా అమలు చే యడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు.

పోషణ్‌ అభియాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలి
ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

జగిత్యాల, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సం క్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని పకడ్భందీగా అమలు చే యడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. సోమవారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్ర మంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంపై రూపొందించిన కరపత్రాలు, వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. పోషన్‌ అభియాన్‌ ప్రతిజ్ఞ చేయించారు. సెప్టెంబరు ఒకటవ తేది నుంచి నెలాఖరు వరకు పోషణ్‌ అ భియాన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పౌష్టికాహార లోపాన్ని నివా రిం చడానికి పిల్లలు, గర్బిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహి స్తు న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, దివా కర, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-05T00:18:44+05:30 IST